చిట్టి గుండెకు గట్టి భరోసా
నిమ్స్లో నవజాత శిశువులకు గుండె శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, సీఎం సహాయ నిధి ఉన్నవారికి ఉచితంగానే ఈ చికిత్సలు చేయనుండడంతో పేద తల్లిదండ్రులకు భరోసా దక్కింది. ఇటీవల పుట్టిన
నిమ్స్లో నవజాత శిశువులకూ చికిత్సలు
అధునాతన పరికరాలు
ఈనాడు, హైదరాబాద్: నిమ్స్లో నవజాత శిశువులకు గుండె శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, సీఎం సహాయ నిధి ఉన్నవారికి ఉచితంగానే ఈ చికిత్సలు చేయనుండడంతో పేద తల్లిదండ్రులకు భరోసా దక్కింది. ఇటీవల పుట్టిన పిల్లల్లోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. గుండె కవాటాల్లో రంధ్రాలు, హృదయ కండరాల్లో ఇబ్బందులు ఇతరత్రా సమస్యలతో చాలామంది చిన్నారులు పుట్టిన కొన్ని రోజులకే కన్ను మూస్తున్నారు. నిమ్స్లో ప్రత్యేకంగా పిడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్ ప్రారంభం కావడంతో ఇలాంటి చిన్నారులకు ఇక ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు తాజాగా ఈ విభాగాన్ని ప్రారంభించారు.
విభాగంలోని ఐసీయూ పడకలు
విశేషాలు
* ఇప్పటివరకు నిమ్స్లో కేవలం పెద్ద పిల్లలు లేదంటే 5 కిలోల బరువు కంటే ఎక్కువ ఉన్న పిల్లలకు మాత్రమే గుండె శస్త్ర చికిత్సలు అందేవి. పిల్లల కోసం ప్రత్యేకించి విభాగమంటూ లేదు.
* ఇకపై ప్రత్యేకంగా పిల్లల గుండె సమస్యల యూనిట్ను అందుబాటులోకి తేవడం విశేషం. నిమ్స్ తరహా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
* గుండెలో లోపాలతో పుట్టిన శిశువులకు కొందరికి రోజుల వ్యవధిలో.. మరికొందరికి ఏడాదిలోపు శస్త్ర చికిత్స చేసి సరిచేయాలి. ఆ తర్వాత చేసినా ప్రయోజనం ఉండదు. చాలామంది పేదలు స్తోమత లేక పిల్లలకు చికిత్సలు చేయించలేకపోతున్నారు.
* దీనికి మొత్తం 50 పడకలు కేటాయించారు. ఇందులో 6 పడకలతో అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) ఏర్పాటు చేశారు. పిల్లల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్-1 ఎయిర్ కండిషన్డ్ ఐసొలేషన్ వార్డు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అతి సూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉంటాయి.
* శస్త్ర చికిత్స చేసేప్పుడు అవసరమయ్యే అత్యాధునిక హార్ట్ లంగ్ యంత్రాన్ని రూ.40 లక్షలతో అమర్చారు.
* శస్త్ర చికిత్స సమయంలో శరీరంలో జరుగుతున్న మార్పులను పసిగట్టి ముందే వైద్యులను హెచ్చరించే అధునాతన కార్డియాక్ అవుట్పుట్ మానిటర్ను అమర్చారు. పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రం ఏర్పాటు చేశారు.
* నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పిడియాట్రిక్, నియోనాటల్ సామర్థ్యాలతో పనిచేసే యూనిట్ అందుబాటులోకి వచ్చింది.
పుట్టుకతో సమస్యలున్న పిల్లలకు పూర్తి భరోసా
- డాక్టర్ అమరేశ్రావు, విభాగాధిపతి, కార్డియోథోరాసిక్ విభాగం, నిమ్స్
పుట్టుకతో గుండె జబ్బులున్న ఉన్న పిల్లలకు, ఇతర పేద రోగులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. నిమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం అందించే వివిధ పథకాలు, దాతలు అందించే నిధుల ద్వారా పేద పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్సలు అందుతాయి. పరికరాలను సమకూర్చడంలో సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ