కనుపాపను చిదిమిన కారు
ముద్దులొలికే ఆ చిన్నారి ఆడుకోవడానికి ఇంటి బయటకు రావడమే పాపమైంది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుతున్న
సనత్నగర్, న్యూస్టుడే: ముద్దులొలికే ఆ చిన్నారి ఆడుకోవడానికి ఇంటి బయటకు రావడమే పాపమైంది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుతున్న తల్లిదండ్రులకు 14 నెలల జ్ఞాపకాలను మిగిల్చి ఆ బుజ్జాయి తిరిగి రాని లోకాలకు వెళ్లింది. ఈ ఘటన సనత్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని జింకలవాడ బస్తీలో ప్రైవేటు ఉద్యోగి అఖిల్ ఉంటున్నాడు. ఆయన ఏకైక కుమార్తె మోక్షిత (14 నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటోంది. బస్తీకి చెందిన మహ్మద్ రసూల్ (27) కొంతమంది యువకులతో కలిసి కారులో వచ్చి బాలిక ఇంటి ముందు ఆపాడు. యువకులు దిగిపోయిన తర్వాత కారును ముందుకు కదిలించిన సమయంలో మోక్షితను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన చిన్నారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. సీసీ ఫుటేజీ, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.