మూడుముళ్ల బంధం.. ముణ్నాళ్ల ముచ్చటేనా?!
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండూ నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ గ్రేటర్లో పలువురు పెళ్లైన కొద్ది నెలలకే భాగస్వామితో సరిపడటం లేదంటూ విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండూ నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ గ్రేటర్లో పలువురు పెళ్లైన కొద్ది నెలలకే భాగస్వామితో సరిపడటం లేదంటూ విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.
నెలకు ఎన్ని కేసులంటే.. కూకట్పల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, పురానీ హవేలీ, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ప్రతినెలా సగటున 250కిపైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్లను ప్రతినెలా 10-15 మంది ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్థికపరమైన అంశాల్లో భిన్నాభిప్రాయాలుండటం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనారోగ్య సమస్యలు, అనుమానాలు విడిపోవడానికి ప్రధాన కారణాలు.
పెళ్లికి ముందే చెప్పడం లేదు.. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్న మహిళల్లో 20 శాతం వరకు పెళ్లైన తర్వాత ఉద్యోగాలు మానేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే డబ్బులు అవసరం అయినప్పుడల్లా భర్తను అడగాలంటే ఇబ్బంది పడుతున్న మహిళలు ఎందరో. తమ ఉద్యోగం, జీవిత లక్ష్యం తదితర భవిష్యత్ ప్రణాళికల గురించి పెళ్లికి ముందే కాబోయే జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా వివరించకపోవడంతో పెళ్లైన తర్వాత సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్య సమస్యలూ.. పెళ్లికి ముందు ఇరువురి అనారోగ్య సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేస్తుండటంతో తర్వాత విషయం తెలిసి వారి మధ్య తీవ్ర అగాధం ఏర్పడుతోంది. చివరికి విడిపోయేందుకు ప్రధాన కారణమవుతోంది. కాబోయే జీవిత భాగస్వామికి ఏవైనా జన్యుపరమైన సమస్యలేమైనా ఉన్నాయా.. లేవా అనేది ముందుగానే నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇవి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు సంక్రమించే అవకాశం ఉండొచ్చు. అలాగే వంధ్యత్వం, లైంగిక వ్యాధుల గురించీ విచారించాలని నిపుణులు చెబుతున్నారు.
పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం
-జి.జ్యోతిరావు, అమికా మధ్యవర్తిత్వ కేంద్ర అధ్యక్షురాలు
ఒక మనిషి మరో మనిషిని అర్థం చేసుకోవడానికి సుమారు 6 నెలలు పడుతుంది. కానీ అంతలోపే విడాకులు కావాలంటూ అడుగుతున్నారు. నేను ఇప్పటివరకు 120 కేసుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాను. ఇందులో 70 శాతం కేసుల్లో అహమే కారణమైంది. పెళ్లి చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో వారికి స్వేచ్ఛనివ్వాలి. పెద్దల జోక్యమే సమస్యలకు దారి తీస్తోంది. ఇరువురి మధ్య చదువు, అంతస్తు, ఆర్థిక సంబంధాలు, సామాజిక స్థితి విడిపోవడానికి కారణమవుతోంది. పెళ్లికి ముందు ప్రేమ, రిలేషన్షిప్నకు సంబంధించి గతంలో అనుభవాలుంటే కాబోయే భార్య/భర్తకు ముందుగానే చెప్పాలి. పెళ్లి తర్వాత తెలిస్తే అపనమ్మకం ఏర్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్