logo

ఒకే వేదికపైకి స్థిరాస్తి సంస్థలు

హైదర్‌నగర్‌లోని శ్రీ భ్రమరాంబ కల్యాణ మండపంలో ‘ఈనాడు’ ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో  ముగిసింది. ఉదయం నుంచి రాత్రి

Published : 27 Jun 2022 02:40 IST

‘ఈనాడు’ ప్రాపర్టీ షోకు స్పందన

ప్రాపర్టీ షోలో స్టాళ్ల వద్ద సందర్శకుల రద్దీ

మియాపూర్‌, న్యూస్‌టుడే: హైదర్‌నగర్‌లోని శ్రీ భ్రమరాంబ కల్యాణ మండపంలో ‘ఈనాడు’ ప్రాపర్టీ షోకు రెండోరోజు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం ప్రారంభమైన ప్రాపర్టీ షో ఆదివారంతో  ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. ప్రాపర్టీ షోలో కొలువుతీరిన పలు ప్రముఖ సంస్థలు ఏర్పాటుచేసిన స్టాళ్ల వద్ద తమ కలల గృహాల కొనుగోలుతో పాటు ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించి సందర్శకులు వివరాలు తెలుసుకున్నారు. ఆయా సంస్థల స్టాళ్ల వద్ద ఉదయం నుంచి పలువురు కుటుంబ సమేతంగా తరలివచ్చి అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లాలు, నగర శివారు ప్రాంతాల్లోని ప్లాట్ల గురించి తమ ఆసక్తికి అనుగుణంగా ఆయా సంస్థల ద్వారా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి విశేషాలను తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి వివరాలను ఒకే వేదికపై తెలుసుకునేలా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనుగోలుదారులు హర్షం వ్యక్తంచేశాడు. ఈ కార్యక్రమంతో ప్రాజెక్టుల వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతోపాటు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఆలోచించి పెట్టుబడి పెట్టేందుకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. స్టాళ్ల నిర్వాహకులు సైతం కొనుగోలుదారుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని