logo

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: ఎమ్మెల్యే

ముప్పై సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని, ఆరు నెలల్లో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌతాపూర్‌లో రూ.18లక్షలతో నిర్మించిన సిమెంటు రహదారులను, రూ.20 లక్షల రూర్బన్‌ నిధులతో

Published : 27 Jun 2022 02:40 IST

సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: ముప్పై సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని, ఆరు నెలల్లో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌతాపూర్‌లో రూ.18లక్షలతో నిర్మించిన సిమెంటు రహదారులను, రూ.20 లక్షల రూర్బన్‌ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహాన్ని  ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కొందరికి ప్రజలు అవకాశమిస్తే పురోగతిని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఉపాధ్యక్షురాలు దీప, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, సర్పంచి రాజప్పగౌడ్‌, ఉపసర్పంచి తాహేరా, విపణి అధ్యక్ష, ఉపాధ్యక్షులు విఠల్‌నాయక్‌, వెంకట్‌రెడ్డి, పార్టీ అధ్యక్షులు అప్పూ, రాందాస్‌, యువజన అధ్యక్షులు రాజుగౌడ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని