అందని వడ్ల దుడ్లు.. ‘వడ్డీ’లే ఆదరువు!
ఖరీఫ్ ప్రారంభమవుతుందంటే చాలు అన్నదాతల కష్టాలు చెప్పనలవికాదు. సకాలంలో అప్పులు పుట్టక, బ్యాంకర్లు సహకరించక, అమ్మిన ధాన్యం డబ్బులు కూడా చేతికందక అవస్థలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇతరుల వద్ద అప్పులు
పెట్టుబడులకు లేక అన్నదాతల ఆందోళన
న్యూస్టుడే, కొడంగల్, దౌల్తాబాద్, పరిగి
కొడంగల్లో ధాన్యంతో బారులు తీరిన ట్రాక్టర్లు
* దౌల్తాబాద్కు చెందిన హన్మయ్య గత నెల 24న 115 బస్తాల ధాన్యాన్ని దేవరపస్లాబాద్ మిల్లులో వేశారు. ఇందుకు గాను రూ.96 వేలు రావాలి. ఇప్పటివరకు నయాపైసా అందలేదు. నాలుగు ఎకరాల్లో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది.
* ఇదే మండల కేంద్రానికి చెందిన చంద్రప్ప 50 బస్తాలను 25రోజుల కిందట కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. సుమారు రూ.35 వేలు అందాల్సి ఉంది.
* దోమ మండలం బాసుపల్లికి చెందిన నరేష్ కౌలు రైతు. రెండెకరాల్లో వరి సాగు చేయడంతో పండిన 70బస్తాల ధాన్యాన్ని బొంపల్లి కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. రూ.54 వేలు రావాల్సి ఉంది. నెల రోజులు కావస్తున్నా జమకాలేదు. పెట్టుబడులకు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్ ప్రారంభమవుతుందంటే చాలు అన్నదాతల కష్టాలు చెప్పనలవికాదు. సకాలంలో అప్పులు పుట్టక, బ్యాంకర్లు సహకరించక, అమ్మిన ధాన్యం డబ్బులు కూడా చేతికందక అవస్థలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లోగా ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ప్రజాప్రతినిధులను నుంచి అధికారుల వరకు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నెల రోజులు దాటుతున్నా అందడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలంలో పనుల్లో రైతులు తలమునకలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం డబ్బులు అందక ఆగమాగం అవుతున్నారు. అప్పు పుట్టడం లేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే ఈరోజు రేపు ఖాతాల్లో జమ అవుతాయని అంటున్నారని వాపోతున్నారు.
108 కొనుగోలు కేంద్రాల ద్వారా
తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో డీసీఎమ్మెఎస్, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ విపణుల ఆధ్వర్యంలో మొత్తం 112 కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో 108 కేంద్రాల ద్వారా 18,068 మంది రైతుల నుంచి 76,122 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో మొదటి రకం 76,042 మెట్రిక్ టన్నులు, రెండవ రకం 80 వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఇందులో ఏ గ్రేడ్కు రూ.1,960, ఉండగా బి గ్రేడ్కు రూ.1,940 చొప్పున మద్దతు ధరలను అందించింది.
ఆభరణాలను తాకట్టుపెట్టుకుని
గ్రామాల్లో నేటికీ వడ్డీ వ్యాపారం కొనసాగుతోంది. రూ.3 చొప్పున అప్పులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రధానంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని వడ్డీ ఇస్తున్నారు. అదును దాటితే విత్తనం విత్తుకున్నా అంతగా ప్రయోజనం ఉండదని అన్నదాతలు చెబుతున్నారు. అమ్మిన పంట డబ్బులు వెంటనే అందితే తమకు ఇలాంటి సమస్య చాలా వరకు ఉండదని అంటున్నారు.
అమలు కాని రుణమాఫీ
రుణమాఫీ అమలు కాకపోవడంతో వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. తొలిదశలో రూ.25వేలు, మలి విడతగా రూ.50వేల వరకు అప్పులున్న వారికి మాత్రం రుణమాఫీని వర్తింప జేసిన ప్రభుత్వం రూ.లక్ష ఏక మొత్తంగా ఉన్న వారికి మాత్రం ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీని కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ వర్తించినా కొత్త రుణం పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 24న విక్రయించా
తిరుపతిరెడ్డి, రైతు, దౌల్తాబాద్.
దౌల్తాబాద్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారికి గతనెల 24న 55 క్వింటాళ్ల ధాన్యం విక్రయించా. నెల రోజులు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.2 చొప్పున అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ధాన్యం డబ్బులు వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు.
రూ. 70 వేలు రావాల్సి ఉంది..
కృష్ణయ్య, చిన్ననందిగామ, కొడంగల్
నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ధాన్యం అమ్మిన డబ్బులు చేతికందలేదు. 35 క్వింటాళ్లు విక్రయించా. దాదాపు రూ.70 వేలు రావాల్సి ఉంది. విత్తనాలు, ఎరువులకు రూ.3చొప్పున వడ్డీకి అప్పు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని