రాజీ పడితే.. ఇద్దరూ నెగ్గినట్లే
‘ప్రజలు ఎలాంటి పట్టింపులకు పోకుండా క్షమాగుణాన్ని అలవర్చుకొని కేసుల విషయంలో రాజీ కుదుర్చుకోవాలి. లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరూ నెగ్గినట్లేనని’ జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి సుదర్శన్ అన్నారు. ఆదివారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ సమక్షంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్
వికారాబాద్, న్యూస్టుడే: ‘ప్రజలు ఎలాంటి పట్టింపులకు పోకుండా క్షమాగుణాన్ని అలవర్చుకొని కేసుల విషయంలో రాజీ కుదుర్చుకోవాలి. లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఇద్దరూ నెగ్గినట్లేనని’ జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి సుదర్శన్ అన్నారు. ఆదివారం స్థానిక న్యాయస్థానంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడారు. అధికంగా కేసులు రాజీ చేయడంలో జిల్లాకు 13వ స్థానం దక్కిందని, దీనిని మరింత మెరుగు పరిచి తొలి స్థానానికి తీసుకువచ్చేలా అందరి సమన్వయంతో కృషి చేద్దామన్నారు. అపరిష్కృత కేసులతో ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో జాప్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికే లోక్ అదాలత్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. లోక్ అదాలత్లో 1,770 కేసులను రాజీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి శంకరి శ్రీదేవి, జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ న్యాయమూర్తి శృతిదూత, ఏపీపీలు అశోక్కుమార్, నారాయణగౌడ్, సమీనాబేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పరిగి, న్యూస్టుడే: రాజీ చేసుకోవడం ద్వారా గెలుపు ఇద్దరిదీ అవుతుందని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి వి.హరికుమార్ అన్నారు. ఆదివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్లో పాల్గొని మాట్లాడారు. సంయమనం పాటిస్తే సమస్యలు చాలా వరకు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏపీపీఓ దీపారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.నరేంద్రయాదవ్, ఏజీపీ బాలముకుందం, న్యాయవాదులు వెంకట్రెడ్డి, ఆనంద్గౌడ్, బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు.
తాండూరు టౌన్: తాండూరులోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి స్వప్న ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 156 కేసులను రాజీ కుదిర్చారు. ఇతర సాధారణ కేసులు 873 ఉండగా వాటినీ పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, విజయ కుమార్ తిరుమల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మహేందర్రెడ్డి, న్యాయ వాదులు శ్రీనివాస్, రాంరెడ్డి, మహిళా న్యాయవాదులు వాణిశ్రీ, సోఫియా, రజిత తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?