HMDA: పోచారంలో ముగిసిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు

పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్‌ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. పోచారంలో 1470 ఫ్లాట్లకు 5921 దరఖాస్తులు రాగా, లాటరీ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) లబ్ధిదారులను ...

Published : 28 Jun 2022 02:05 IST

హైదరాబాద్‌: పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్‌ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. పోచారంలో 1470 ఫ్లాట్లకు 5921 దరఖాస్తులు రాగా, లాటరీ ద్వారా హైదరాబాద్‌ మహానగరాభివద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొత్తం 1,404 ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించింది. వీటిలో 1 బీహెచ్‌కే 440, 2 బీహెచ్‌కే 822, 3 బీహెచ్‌కే 52, 3 బీహెచ్‌కే డుప్లెక్స్‌ 90 ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించారు. దీనికి సంబంధించి లాటరీలో ఫ్లాట్లను దక్కించుకున్న వారి వివరాలను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. 

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి సంబంధించి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ఇవ్వగా అనూహ్య స్పందన లభించింది.  2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని