Hyd News: వైద్యుల విందు.. కడుపులోనే కన్నుమూసిన పసికందు!
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్ఘాట్ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం..
చాదర్ఘాట్, న్యూస్టుడే: వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చాదర్ఘాట్ పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. అంబర్పేట గోల్నాక ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆరిఫ్ భార్య సురయ్య ఫాతిమా(24) కాన్సు కోసం ఈనెల 24న చాదర్ఘాట్ అక్బర్ టవర్స్లోని ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. 26న సాయంత్రం 3 గంటలకు పురిటి నొప్పులు రావడం కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో ఆమెకు రాత్రి 9 గంటలకు నొప్పులు రావడంతో ఆ విషయం చెప్పడానికి కుటుంబ సభ్యులు వెళ్లగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కానరాలేదు. ఎక్కడికెళ్లారని పరిశీలించగా.. ఆసుపత్రి టెర్రస్పైన విందు ఏర్పాటు చేసుకొని.. మ్యూజిక్ సిస్టం పెట్టుకొని నృత్యం చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గంట తర్వాత విందు ముగించుకొని వచ్చిన వైద్యులు.. ఫాతిమాను పరీక్షించి కడుపులోని శిశువు మృతి చెందిందని వెల్లడించినట్లు తెలిపారు. సకాలంలో వైద్యం చేయకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యజమానురాలు కుమార్తె పెళ్లి వచ్చే నెలలో జరగనుండటంతో విందు ఏర్పాటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.
ఆసుపత్రిని మూసేయాలి.. నా భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని వైద్యుల వద్దకు వెళ్లగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది అంతా పాటలు, నృత్యాలలో మునిగి తేలారు. గంట తరువాత వచ్చి చూసి కడుపులో బిడ్డ మృతి చెందింది.. ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పారు. ఇతర రోగులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఆసుపత్రిని మూసివేయాలి. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తామని ఫాతిమా భర్త సయ్యద్ ఆరిఫ్ తెలిపారు.
యాజమాన్యంపై కేసు నమోదు.. బాధితురాలి భర్త ఆరిఫ్ ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై ఐపీసీ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. మృత శిశువును ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!