హ్యాపీ వీకెండ్.. హాయ్ బ్రో.. అంటే కొకైన్ సరఫరా!
‘‘హ్యాపీ వీకెండ్... హాయ్ బ్రో... హౌ ఫార్ యు’’ వంటి సంకేత పదాలతో కొకైన్ను సరఫరా చేస్తున్న రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
అదుపులోకి తీసుకున్న డ్రగ్స్ ముఠా వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్
ఈనాడు, హైదరాబాద్: ‘‘హ్యాపీ వీకెండ్... హాయ్ బ్రో... హౌ ఫార్ యు’’ వంటి సంకేత పదాలతో కొకైన్ను సరఫరా చేస్తున్న రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురు ఆఫ్రికన్లు హెన్రీ చిగ్బో, అమోబీ ఛువుడీ, మథియాస్, యెమన్ దేశస్థుడు అహ్మద్ కమాల్లను బంజారాహిల్స్లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.13 లక్షల విలువైన కొకైన్, మెటా ఆంఫిటమైన్ను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకున్న 23 మందిని అరెస్టు చేయనున్నామని వివరించారు. కీలక నిందితుడు డివైన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
గ్రాము రూ.10 వేలు.. : దిల్లీలో ఉంటున్న డివైన్ సుజీ.. విమానాలు, అంతర్జాతీయ కొరియర్ల ద్వారా మాదకద్రవ్యాలు కొకైన్, మెటా ఆంఫిటమైన్లను కిలోలకొద్దీ తెప్పిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పర్యాటక వీసాతో నైజీరియా, టాంజానియా నుంచి హెన్రీ చిగ్బో, అమోబీ, మథియాస్లు వేర్వేరుగా దిల్లీకి వచ్చారు. వీసా గడువు ముగిసినా వారు వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో ఉంటున్నారు. మూడేళ్ల నుంచి వీరు కొకైన్, మెటా ఆంఫిటమైన్లను డివైన్ సుజీ నుంచి కొద్ది మొత్తాల్లో దిల్లీ నుంచి తెచ్చి బెంగళూరు, హైదరాబాద్, ముంబయి నగరాల్లో విక్రయిస్తున్నారు. హెన్రీపై బెంగళూరులో కేసులుండగా.. హైదరాబాద్ పోలీసులు రెండేళ్ల క్రితం అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలై దిల్లీకి పారిపోయాడు. అమోబీపై బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో రెండు కేసులున్నాయి. బెంగుళూరు పోలీసులు అతని పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్కు మకాం మార్చాడు. మరో ముఠాకు చెందిన మథియాస్ నాలుగేళ్ల నుంచి చిన్న చిన్న నేరాలు చేస్తున్నాడు. మాస్కులు విక్రయిస్తానంటూ మోసం చేయగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్పై వచ్చాక యెమన్ దేశస్థుడు అహ్మద్ కమాల్తో పరిచయమైంది. రెండేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి బెంగళూరులో ఉంటున్న ఇమ్మానుయేల్ నుంచి మెటా ఆంఫిటమైన్ను తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో గ్రాము రూ.10వేలకు విక్రయిస్తున్నారు.
* డ్రగ్స్ విక్రయాలు బయటపడకుండా చరవాణుల్లో యాప్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. స్నాప్చాట్ ద్వారా ‘‘హాయ్ బ్రో, హ్యాపీ వీకెండ్, హౌ ఫార్ యు, వెన్ కమింగ్’పేర్లను కొకైన్కు సంకేతాలుగా వినియోగిస్తున్నారు. ఈ సంకేతాల ద్వారా వీరు నాలుగైదు నెట్వర్క్లను నిర్వహిస్తున్నారు. స్నాప్చాట్లో సందేశాన్ని పంపితే.. రెండు, మూడు నిముషాల్లో అది రెండుఫోన్లలోనూ అదృశ్యమవుతుంది. దీంతో పోలీసులకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించవు.
* టోలీచౌకీలోని పారమౌంట్ కాలనీలో నివసిస్తున్న అమోబీకి డ్రగ్స్ వస్తున్నాయన్న సమాచారంతో హైదరాబాద్ మాదకద్రవ్యాల నిఘా విభాగం ఇన్స్పెక్టర్లు రాజేష్, రమేష్రెడ్డి బుధవారం తెల్లవారుజామున పారమౌంట్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద ఉన్నారు. బెంగుళూరు నుంచి హెన్రీ చిగ్బో 20గ్రాముల కొకైన్ను తీసుకుని అమోబీకి ఇచ్చేందుకు రాగా రెడ్హ్యండెండ్గా పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మద్ కమాల్, మథియాస్లను కూడా పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సు ఢీకొని.. నలుగురు ఇంటర్ విద్యార్థుల దుర్మరణం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..