వాహనాల కూత.. చెవిలో మోత
నగరంలో పెరుగుతున్న వాహనాలతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటా వాయు నాణ్యత తగ్గిపోవడానికి 51 శాతం వాహనాల నుంచి వెలువడే కాలుష్యమే కారణం.
తొమ్మిది ప్రాంతాల్లో లెక్కింపు..!
కాలుష్య నియంత్రణ మండలి.. వాణిజ్య, నివాస, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి శబ్ద కాలుష్యాన్ని లెక్కిస్తోంది. సీపీసీబీ పరిమితులు ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటాయి. నగరంలో జూబ్లీహిల్స్, తార్నాక, అబిడ్స్, జేఎన్టీయూ, సనత్నగర్, జీడిమెట్ల, జూపార్క్, గచ్చిబౌలిలో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుంది. ఉదయం, పగలుగా విభజించి శబ్దాలను రికార్డు చేస్తోంది.
తార్నాకలో శబ్ద కాలుష్యం ఎక్కువ
తార్నాకలో ఇటీవల శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021లో 60 డెసిబుల్స్గా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్లో 67 డెసిబుల్స్ వరకు పెరిగింది. అత్యంత సున్నిత ప్రాంతమైన జూపార్కు వద్ద 70కి చేరింది. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ.. నివాస సముదాయాల్లో పెరుగుతోంది. శబ్ద తీవత్ర పెరగడంతో నగరవాసులకు ప్రశాంతత కరవవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్