ఆత్మ నిర్భర్ విశ్వాసం
చిరు వ్యాపారులకు రుణాలు మంజూరూ చేస్తూ.. వారి చింతలను తొలగిస్తూ ’ఆత్మనిర్భర్’ పథకం ఆదుకుంటోంది. మొదటి, రెండు, మూడు విడతలుగా వారికి రుణాలను అందిస్తుంది.
వీధి వ్యాపారులకు సహకారం
మూడో విడత రుణాల పంపిణీకి చర్యలు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ
సమావేశంలో పాల్గొన్న వ్యాపారులు
చిరు వ్యాపారులకు రుణాలు మంజూరూ చేస్తూ.. వారి చింతలను తొలగిస్తూ ’ఆత్మనిర్భర్’ పథకం ఆదుకుంటోంది. మొదటి, రెండు, మూడు విడతలుగా వారికి రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద అతి తక్కువ వడ్డీతో ఎటువంటి పూచికత్తు లేకుండానే ఇస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ఈ పథకాన్ని ప్రకటించి, కొనసాగిస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో నెలల తరబడి లాక్డౌన్ విధించటంతో వీరంతా ఆర్థికంగా దెబ్బతిన్నారు. రెండేళ్లుగా దీనిని కొనసాగిస్తున్నారు. మొదటి విడత 2020-2021 సంవత్సరానికి చెల్లింపులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. ఈ ప్రక్రియలో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానం, రాష్ట్రంలో జిల్లా అయిదో ర్యాంకులో నిలిచిందని మెప్మా అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పురపాలికల్లో వీధి వ్యాపారులు చేసేకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. వీరి వ్యాపారాలు సజావుగా సాగేందుకు సహకారం అందిస్తున్నారు. ఇందుకుగాను మెప్మా సిబ్బంది వివరాలను సేకరించి అర్హులను గుర్తించారు. వారికి రుణం ఇవ్వాలని బ్యాంకర్లకు సిఫారసు చేయడంతో మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభాలో 5 శాతం వీధి వ్యాపారులను గుర్తించాలి. వీధి వ్యాపారుల కోసం వికారాబాద్లో ప్రత్యేకంగా 20 షెడ్లలను నిర్మించారు. వీటిని కేటాయించాల్సి ఉంది.
ఈ- శ్రమ్ కార్డు పంపిణీ
రెండో విడత సక్రమంగా చెల్లించిన వారికి..
హామీ పత్రాలు, పూచికత్తు లేకుండా కేవలం వెండర్ గుర్తింపు కార్డు అర్హతతో గతేడాది వ్యక్తిగత ఖాతాకు రూ.10 వేలు జమ చేశారు. ఏడాది కాలంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ విధంగా సకాలంలో చెల్లించిన వారికి వెంటనే రూ. 20 వేలు మంజూరు చేశారు. రెండో విడత 18 నెలల్లో చెల్లించిన వారికి మూడో విడత కోసం ఎంపిక చేస్తున్నారు. వీరికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. చాలా మంది వీధి వ్యాపారులు సకాలంలో రుణాలను చెల్లించి అర్హత సాధిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే తగ్గింపు
రుణాన్ని అన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే మొత్తంలో రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పించాయి. కొందరు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఫోన్పే, రూపే, గూగుల్పే వినియోగించినట్లు తెలిపారు.
బీమా సదుపాయం
రవికుమార్, మెప్మా జిల్లా అధికారి, వికారాబాద్
వీధి వ్యాపారులకు ప్రభుత్వం ఎన్నో రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. రెండో విడతలో పూర్తి కిస్తులు చెల్లించిన వారికి మూడో విడతగా రూ.50 వేలు మంజూరు చేస్తారు. స్వానిధి సమృద్ధి పథకం కింద బ్యాంక్ ద్వారా బీమా, ఫించన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కార్మికశాఖ ద్వారా ఈ- శ్రమ్ కార్డును పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డును అందజేస్తారు.
కొత్త వారిని గుర్తిస్తాం
వెంకటేశం, మెప్మా వికారాబాద్ పట్టణ అధికారి.
జిల్లా కేంద్రంలోని వీధి వ్యాపారులు రెండో విడత రుణ కిస్తులను సక్రమంగా చెల్లించాలి. కొత్త వారిని గుర్తించి బ్యాంకులకు సిఫారసు చేస్తాం. పట్టణానికి కొత్తగా వీధి వ్యాపారులు చేసుకునే వారు వస్తుంటారు ఈ లాంటి వారికి ఇది ప్రయోజనం. సైకిళ్లు, తోపుడు బండ్లు, రోడ్ల పక్కన చిన్న వస్తువులు అమ్మేవారిని పరిగణనలోకి తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
[ 18-04-2024]
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
[ 18-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ ఆలౌట్.. ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం