logo

కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి

కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ మండలం గొట్టముక్కల గేటు సమీపంలో గురువారం ఉదయం జరిగింది.

Published : 30 Jun 2022 10:51 IST

వికారాబాద్‌ : కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ మండలం గొట్టముక్కల గేటు సమీపంలో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే పరిగి మండలం నస్కల్‌కు చెందిన బోయిన మోహన్‌ (40), ఖాజా (45), ద్విచక్రవాహనంపై వికారాబాద్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో గొట్టిముక్కల గేటు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని