KTR: కేసీఆర్.. మోదీ పరిపాలనకు బేరీజు వేయండి: మంత్రి కేటీఆర్
ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన, మోదీ పరిపాలనకు బేరీజు వేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా
హైదరాబాద్: ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన, మోదీ పరిపాలనకు బేరీజు వేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మేం చేసిన అభివృద్ధి పనులు వంద చెబుతాం... తెలంగాణలో కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి చెప్పాలని సవాల్ విసిరారు.
‘‘ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. టూరిస్టులు వస్తారు.. రెండ్రోజులు లొల్లిపెట్టి పోతారు. వాళ్లకు తెలిసిందల్లా అబద్దాలు చెప్పడమే. దేశంలో 20 టాప్ 20 గ్రామాలు ప్రకటిస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయి. మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు మోదీ గగ్గోలు పెట్టారు. సామాన్యులు ఎలా బతకాలని నిలదీశారు. చేతగాకపోతే దద్దమ్మ ప్రధాని దిగిపోవాలని అప్పట్లో విమర్శించారు. కానీ, ఇప్పుడు మోదీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,050కి చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79కి పెరిగింది. స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయుల నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. వేశారా? యువతకు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఏమయ్యాయి? వీటన్నింటిపై తెలంగాణ ప్రజలు భాజపా నేతలను నిలదీయాలి’’ అ ని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!