logo

బంధం తెగుతుందని.. బతుకు తెంచేసుకున్నారు!

వారిద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. పెద్దలకు తెలియడంతో పారిపోయారు.. తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. పోలీసులు వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఠాణా

Published : 01 Jul 2022 04:04 IST

మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య

జీడిమెట్ల, న్యూస్‌టుడే: వారిద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. పెద్దలకు తెలియడంతో పారిపోయారు.. తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. పోలీసులు వివరాల ప్రకారం.. జీడిమెట్ల ఠాణా పరిధిలో ఉండే బాలిక(14), బాలుడు(14) స్థానిక ప్రభుత్వ బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇద్దరిని మందలించారు. అయినా మార్పు రాకపోవడంతో బాలికను పాఠశాల బంద్‌ చేయించారు. గురువారం సొంతూరుకు తీసుకెళ్లాలని కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలియడంతో బుధవారమే ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. గుర్తించిన కుటుంబీకులు వేర్వేరుగా జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు వద్ద బాలుడి సైకిల్‌ కనిపించడంతో పాటు బాలిక మృతదేహం నీటిపై తేలింది.   పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. తప్పిపోయిన బాలికగా గుర్తించారు.  బాలుడి మృతదేహం కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడికి ఈత వచ్చు అని... మునిగిపోయాడా? లేక ఒడ్డుకు చేరాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే గాలింపు చర్యలు చేపడితే బతికేవారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని