పనికి వెళ్తూ... పరలోకాలకు
కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలైన సంఘటన వికారాబాద్ మండలం గొట్టిముక్కల గేటు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పరిగి మండలం నస్కల్కు
కారు- బైక్ ఢీకొని ముగ్గురి మృతి
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
వికారాబాద్, న్యూస్టుడే: కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మిత్రులు దుర్మరణం పాలైన సంఘటన వికారాబాద్ మండలం గొట్టిముక్కల గేటు సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పరిగి మండలం నస్కల్కు చెందిన బోయిని మోహన్(45), మహమ్మద్ ఖాజామియా(49) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, బోయిని అంజయ్య(45) హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఉదయం 7 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో గ్రామస్థులు ముగ్గురు మృత్యువాత పడటంతో ఊరంతా విషాదఛాయలు అలముకున్నాయి. వీరివి రెక్కాడితే గానీ డొక్కాడని నేపథ్యమున్న కుటుంబాలు. ఒకేచోట భవన నిర్మాణ(సెంట్రింగ్) కార్మికులుగా పని చేసేవారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిత్యం ముగ్గురూ పని కోసం ఒకే ద్విచక్ర వాహనంపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. రోజు మాదిరిగానే పని నిమిత్తం గురువారం బైక్పై వికారాబాద్ పట్టణానికి వస్తున్నారు. మార్గమధ్యంలోని గొట్టిముక్కల గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొని ఉసురు తీసింది. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి శవాగారానికి తరలించి మరణోత్తర పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు మోహన్ పెద్ద కొడుకు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
దుబాయ్ వెళ్లి ఇంటి నిర్మాణం కోసం వచ్చి..
మృతుడు బోయిని మోహన్కు పెద్దల నుంచి సంక్రమించిన నాలుగెకరాల పొలం ఉంది. భార్య ప్రభావతి, కుమారులు సాయికుమార్(డిగ్రీ), వేణుకుమార్(ఇంటర్), నందిని (పదోతరగతి) సంతానం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఐదేళ్ల కిందట ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బు సంపాదించుకొని సరిగ్గా ఏడాది కిందట నస్కల్కు వచ్చాడు. నిర్మాణం పూర్తి కాగానే మళ్లీ వెళ్లి ఐదేళ్లు ఉండి వస్తానని గ్రామస్థులతో చెప్పేవాడు. పూర్తయ్యాక మరోమారు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పరాయి దేశం వెళ్లి ఏకాకిగా బతికే బదులు ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని జీవించవచ్చని నచ్చచెప్పడంతో... ఆ ఆలోచన విరమించుకొని భవన నిర్మాణ పనులకు వెళ్తున్నాడు.
అత్తగారింట్లో స్థిరపడి..: మహమ్మద్ ఖాజామియాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి. పదిహేనేళ్ల కిందట నస్కల్కు చెందిన మైముదాబేగంతో వివాహమైంది. సొంత ఊళ్లో జీవనాధారం లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ అత్తగారింట్లోనే స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు సంతానం. అత్తమామలకూ ఆస్తిపాస్తులు లేకపోవడంతో నిత్యం వికారాబాద్, పరిగి ప్రాంతాలకు వెళ్లి పని చేసి కుటుంబాన్ని పోషించే వాడు. ఖాజామియా మృతితో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పెద్ద దిక్కును కోల్పోయి..: బోయిని అంజయ్యకు ఎకరన్నర పొలం ఉంది. భార్య శారదమ్మ, కొడుకు ప్రేమ్కుమార్(ఇంటర్) సంతానం. తొలకరి వర్షాలు కురియగానే ముగ్గురూ కలిసి పొలంలో విత్తనాలు నాటడం పూర్తి చేశారు. భార్య ఊళ్లోనే కూలికి వెళ్తుండగా, అంజయ్య భవన నిర్మాణ పనులకు వెళ్లేవాడు. ఇద్దరి సంపాదనతోపాటుగా పొలంపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవించే వారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భారమంతా భార్యపైనే పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ