HMDA: హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం... తొర్రూరులో గజం రూ.35,550

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌  అథారిటీ (హెచ్‌ఎండీఏ) రూపొందించిన తొర్రూర్‌

Published : 02 Jul 2022 02:09 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన తొర్రూర్‌ లేఅవుట్‌లో ప్లాట్లు వేలం వేశారు. రెండో దఫా 140 ప్లాట్లను వరుసగా 3 రోజుల పాటు ఆన్‌లైన్‌ వేలం ద్వారా హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. శుక్రవారం రెండు సెషన్లలో 42 ప్లాట్లకు జరిగిన ఆన్‌లైన్‌ వేలంలో 41 ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఉదయం సెషన్‌లో అత్యధికంగా గజం రూ.33,000లు, అత్యల్పంగా గజం రూ.23,000లు పలికింది. సాయంత్రం సెషన్‌లో అత్యధికంగా గజం రూ.35,550లు బిడ్‌ చేయగా.. అత్యల్పంగా గజం రూ.21,000లు ధర పలికింది. మొత్తం రూ.33.58 కోట్ల విలువజేసే 41 ప్లాట్లకు ఆన్​లైన్​ వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి. మిగతా 106 ప్లాట్లకు శనివారం, సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా వేలం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని