logo

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు భారీ స్వాగతం

ఈ నెల 2(శనివారం)న హైదరాబాద్‌కు చేరుకోనున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు భారీ స్వాగతం పలకనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న యశ్వంత్‌

Published : 02 Jul 2022 01:33 IST

పది వేల బైక్‌లతో ర్యాలీ: మంత్రి తలసాని

తెరాస ముఖ్య నేతలతో సమావేశమైన మంత్రి తలసాని

బేగంపేట, న్యూస్‌టుడే: ఈ నెల 2(శనివారం)న హైదరాబాద్‌కు చేరుకోనున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు భారీ స్వాగతం పలకనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలకడంతో పాటు ఆయన వెంట 10 వేల బైక్‌లతో బేగంపేట నుంచి రాజ్‌భవన్‌ రోడ్‌, నెక్లెస్‌ రహదారి మీదుగా జలవిహార్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. శుక్రవారం సనత్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో మంత్రి తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస జెండాలు ఏర్పాటు చేసుకున్న బైక్‌లతో ర్యాలీలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కనీసం 1500 ద్విచక్రవాహనాలతో కార్యకర్తలు ర్యాలీకి హాజరుకావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని