logo

మైనర్ల ప్రేమ విషాదాంతం

జీడిమెట్లలో కలకలం సృష్టించిన మైనర్‌ ప్రేమ జంట కథ విషాదాంతమైంది. కనీసం బాలుడైనా ప్రాణాలతో ఉంటాడని అనుకున్నా.. ఒక రోజు తర్వాత చెరువులో మృతదేహం లభించడంతో ఇరు కుటుంబాలూ శోకసంద్రంలో మునిగాయి. తొమ్మిదో తరగతి

Published : 02 Jul 2022 01:33 IST

శుక్రవారం బాలుడి మృతదేహం గుర్తింపు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: జీడిమెట్లలో కలకలం సృష్టించిన మైనర్‌ ప్రేమ జంట కథ విషాదాంతమైంది. కనీసం బాలుడైనా ప్రాణాలతో ఉంటాడని అనుకున్నా.. ఒక రోజు తర్వాత చెరువులో మృతదేహం లభించడంతో ఇరు కుటుంబాలూ శోకసంద్రంలో మునిగాయి. తొమ్మిదో తరగతి బాలుడు(14), బాలిక(14) ప్రేమ విషయం ఇళ్లలో తెలియడంతో బుధవారం ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరూ చున్నీతో కట్టుకొని ఫాక్స్‌సాగర్‌ చెరువులో దూకినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాలిక నుంచి చున్నీ వేరు కావడంతో మరుసటి రోజే మృతదేహం నీటిలో తేలింది. బాలుడి మృతదేహం శుక్రవారం ఉదయం నీటిపై తేలినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని