కమలంతోటి..కారు పోటీ
మహానగరం రెండు రోజులపాటు ప్రధాన పార్టీల రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారబోతోంది. నగరానికి ఒక వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. లక్షలమందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించబోతోంది. మరోవైపు ప్రతిపక్షాల
కాషాయం, గులాబి రంగులద్దుకున్న నగరం
హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నాగలిని
తిలకిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
చిత్రంలో లక్ష్మణ్, తరుణ్ఛుగ్, బండి సంజయ్
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మహానగరం రెండు రోజులపాటు ప్రధాన పార్టీల రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారబోతోంది. నగరానికి ఒక వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. లక్షలమందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించబోతోంది. మరోవైపు ప్రతిపక్షాల తరఫున దేశ ప్రథమ పౌరుడి అభ్యర్థిగా బరిలో నిల్చిన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో కాకుండా ఇతర రోజుల్లో ఇలా రాజధానిలో రెండు పార్టీలు భారీ కార్యక్రమాలను నిర్వహించడం అరుదు. ఈ రెండు రోజుల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
అతిరథులంతా ఇక్కడే..
గచ్చిబౌలి నొవాటెల్లో శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. వీటి ప్రారంభానికి ముందే అంటే శనివారం ఉదయం భాజపా పదాధికారుల సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం నుంచి జరిగే కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీతోతోపాటు కేంద్రానికి చెందిన 45 మంది మంత్రులు, 14 మంది ముఖ్యమంత్రులతోపాటు ఇతర కీలక నేతలు పాల్గొనబోతున్నారు. దీంతో గచ్చిబౌలి ప్రాంతంలో పూర్తిస్థాయిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ను మళ్లించారు. ఇదే సమయంలో శనివారం రోజే తెరాస కూడా బలప్రదర్శనకు సిద్ధమైంది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నగరానికి రాబోతున్నారు. బేగంపేట విమానాశ్రయానికి సిన్హా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11 గంటల తర్వాత రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వేలాది మందితో భారీ ర్యాలీగా నెక్లెస్రోడ్డు వరకు వచ్చి అక్కడ సభను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి నగరమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తోపాటు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేలాది మందితో ప్రదర్శనకు సిద్ధమయ్యారు. దీంతో శనివారం బేగంపేటతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. తమ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కావాలనే తెరాస ఈ ర్యాలీ ఏర్పాటు చేసిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. అబ్బే అదేం లేదని ముందస్తు నిర్ణయం మేరకే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెరాస నేతలు చెబుతున్నారు.
తెరాస నేతలకు భయపడొద్దు: కిషన్రెడ్డి
బర్కత్పుర: రాష్ట్రంలో రోజురోజుకు పార్టీ బలపడుతుండటంతో బలహీనం చేసేందుకు తెరాస నేతలు బెదిరింపులకు గురిచేయడంతోపాటు ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. తెరాస నేతల బెదిరింపులకు భయపడవద్దని, ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. శుక్రవారం బర్కత్పురలోని నగర పార్టీ కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో భాజపాలోకి వచ్చినప్పటికీ టికెట్లు ఇవ్వడంతో పాటు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే .. పార్టీ మారడం బాధాకరమన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్కుమార్, పలు జిల్లాల అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతంరావు, వి.పాండుయాదవ్, బి.శ్యామ్సుందర్గౌడ్, సురేందర్రెడ్డి, సామ రంగారెడ్డి, హరీశ్రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
నెక్లెస్రోడ్డులో తెరాస, భాజపా పక్కపక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, కటౌట్
అమర వీరుల చిత్రపటాలకు నివాళి అర్పిస్తున్న జేపీ నడ్డా
అతిథులకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే రఘునందన్రావు చిత్రంలో బండ కార్తికరెడ్డి
పరేడ్ మైదానంలో జాగిలాలతో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూకబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం
[ 28-03-2024]
ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాప్రా తహసీల్దార్ టి. సుచరిత పేర్కొన్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 28-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
[ 28-03-2024]
మనవరాలిని చూసేందుకు నగరానికి వచ్చిన తాతయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ రాణా పరిధిలో జరిగింది. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
[ 28-03-2024]
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
[ 28-03-2024]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
[ 28-03-2024]
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!