ప్రజావాణి..వినిపించదా..!
అన్నీ చిన్న సమస్యలే. అధికారులు మనసుపెడితే అరగంటలో పరిష్కారమయ్యేవే. కొందరి నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరితో ఏళ్లకేళ్లు పెండింగ్లో పడిపోతున్నాయి. పింఛను, రెండు పడకగదుల ఇళ్లు, పట్టాలివ్వాలంటూ ‘ప్రజావాణి’లో నిరుపేదలు పెట్టుకుంటున్న
అర్జీలకు సకాలంలో దక్కని మోక్షం
తహసీల్ కార్యాలయాల్లో ఏళ్లుగా పెండింగ్.. కలెక్టరేట్లలోనూ అంతే
ఈనాడు- హైదరాబాద్ - కీసర కలెక్టరేట్, న్యూస్టుడే: అన్నీ చిన్న సమస్యలే. అధికారులు మనసుపెడితే అరగంటలో పరిష్కారమయ్యేవే. కొందరి నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరితో ఏళ్లకేళ్లు పెండింగ్లో పడిపోతున్నాయి. పింఛను, రెండు పడకగదుల ఇళ్లు, పట్టాలివ్వాలంటూ ‘ప్రజావాణి’లో నిరుపేదలు పెట్టుకుంటున్న అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి పనులు మానుకుని వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఏళ్ల తరబడి తహసీల్దార్లు, స్థానిక మున్సిపల్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారం దక్కక.. కలెక్టరేట్ వరకూ వస్తున్న అర్జీదారులకు చేదు అనుభవమే మిగులుతోంది. జిల్లా స్థాయి అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నా.. పరిష్కారం దొరక్క.. ఎవరికి చెప్పాలో అర్థంమవక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా కలెక్టరేట్లకు వచ్చే సగం అర్జీల్లో ఇలాంటివే ఎక్కుగా ఉంటున్నాయి. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లలో వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన పలువురితో మాట్లాడగా.. తమ ఆవేదనను పంచుకున్నారు.
అన్యాయంగా నా ఇంటిని కూల్చేశారయ్యా..!
చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు చంద్రమ్మ. అంధురాలు. సోదరుడు, 13 ఏళ్ల కుమార్తె సాయంతో కలెక్టరేట్కు వచ్చారు. 1993లో ఖైరతాబాద్ రాజీవ్గాంధీనగర్లో ప్రభుత్వమిచ్చిన ఇంటి స్థలాన్ని కొందరు స్థానిక నేతలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక తహసీల్దార్కు నాలుగేళ్లుగా పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆర్డీవోకు అర్జీ ఇవ్వాలనుకున్నా కలవనివ్వలేదు. ఇప్పుడు కలెక్టరేట్కు వచ్చాం. అధికారులకు ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛను కోసం రెండేళ్లుగా..
తన కుమారుడి మానసిక స్థితి సరిగాలేదని.. అన్ని అర్హత పత్రాలతో రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా అధికారులు ఇప్పటికీ పరిష్కరించడం లేదంటూ రామంతాపూర్వాసి కె.బీరప్ప చెప్పారు. కూలిపనే తమకు ఆధారమన్నారు. రెండేళ్ల క్రితం మున్సిపల్, రెవెన్యూ అధికారులకు, తరువాత కలెక్టరేట్కు వచ్చి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నా.
కలెక్టర్ లేరు.. పరిష్కరించలేం అంటున్నారు - రఘునాథ్రెడ్డి, గౌడవెల్లి
‘రెండెకరాల స్థలం విక్రయించేందుకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని దరఖాస్తు పెట్టుకుని తొమ్మిది నెలలవుతోంది. మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఐదు సార్లు అర్జీ పెట్టుకున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ లేనందున.. పరిష్కరించడం లేదని అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఈలోపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. ప్రతిసారీ అధికారులు తిప్పిపంపడంతో ఇబ్బందిపడుతున్నాము.
ఆరేళ్లుగా ప్రదక్షిణలు - దామోదర్ చారి, రాంపల్లి
రాంపల్లిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సొంతిల్లు లేదు. రెండు పడకగదుల ఇంటి కోసం 2016లో దరఖాస్తు చేసుకున్నా. నాగారం మున్సిపల్ అధికారులకు పలుమార్లు అర్జీ పెట్టుకున్నా. మేడ్చల్ కలెక్టరేట్లో ఐదుసార్లు అర్జీ పెట్టుకున్నా. అధికారులు దరఖాస్తు స్వీకరిస్తున్నా.. తర్వాత పరిస్థితి ఏంటో చెప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!