కొరవడిన నిఘా..యథేచ్ఛగా దగా
చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ, కర్ణాటకకు తరలిస్తున్న లారీని కొడంగల్ పోలీసులు జూన్ 6న పట్టుకున్నారు. ఇందులో 250 క్వింటాళ్లున్నాయి.
సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
వికారాబాద్లో స్వాధీనం చేసుకున్న ట్రాలీ
చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ, కర్ణాటకకు తరలిస్తున్న లారీని కొడంగల్ పోలీసులు జూన్ 6న పట్టుకున్నారు. ఇందులో 250 క్వింటాళ్లున్నాయి.
గత నెలలో కొడంగల్లో 51 క్వింటాళ్లతో తరలిస్తున్న డీసీఎం వ్యానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దోమ మండలం మోత్కూరులో నిల్వ చేసిన 35 క్వింటాళ్లు టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ పురపాలక సంఘం పరిధి అనంతగిరి సమీపంలో ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 22 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న 16క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో వికారాబాద్ నుంచి పటాన్చెరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్, మున్సిపాలిటీ
దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు చేపడుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అయితే అమలులో లోపాలు తలెత్తడంతో అవి పక్కదారి పడుతున్నాయి. వెరసి లక్ష్యం అభాసుపాలవుతోంది. ఇందుకు ఉదాహరణగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న రేషన్ బియ్యం. జిల్లాలో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. వందల క్వింటాళ్ల కొద్దీ బియ్యం పక్కదారి పడుతున్నప్పటికీ పకడ్బందీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఓవైపు పంపిణీ అవుతుండగా మరోవైపు పట్టుబడటం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. దొరికితేనే దొంగ అన్న చందంగా చాప కింద నీరులా వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది. తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్లోనూ దందా జోరుగా జరుగుతోంది. బియ్యాన్ని సేకరించి కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 588 రేషన్ దుకాణాలున్నాయి. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతోంది. ఆయా దుకాణాల పరిధిలో 2,34,940 రేషన్ కార్డులున్నాయి. సుమారు 9వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని నేరుగా అర్ధరాత్రి సమయంలో రైసు మిల్లులకు చేరవేస్తున్నారు. వాటిని మరాడించి మార్పు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ పేదలను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు.
ఆరు నెలల్లో 69 కేసులు
అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నా కఠినచర్యలు మాత్రం కనిపించడం లేదు. ఈఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 69కేసులకు పైగా నమోదయ్యాయి. 1087.42 క్వింటాళ్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వ్యవహారం ఎలా నడుస్తుందో ఇట్టే తెలిసిపోతోంది. ఒకే తీరు అక్రమాలకు పాల్పడుతూ మూడు అంతకన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే సదరు అక్రమార్కులపై పీడీ చట్టం నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్కరిపైనా ఇలాంటివి నమోదు కాలేదు. దొరుకుతున్న వారిపై 6ఏ కేసులు నమోదు చేసి వదిలేయడంతో అక్రమ వ్యాపారం సజావుగా సాగిపోతోంది.
ఊరూవాడా సేకరణ
కొంతమంది ప్రత్యేకంగా గ్రామాల్లో బియ్యం పంపిణీ జరుగుతున్న సమయాల్లో తిరుగుతున్నారు. అల్లం అమ్మకాల పేరిట అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటింటా ఆటోల ద్వారా సేకరించి తరలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అధికారులు పల్లెల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని అక్రమార్కుల ఆట కట్టించవచ్చని పలువురు చెబుతున్నారు.
వినియోగదారులు విక్రయించినా తప్పే: రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి
పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్రమ బియ్యం రవాణాను అరికడతాం. గ్రామాల్లో నిఘా మరింత పెంచుతాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే క్రమంలో రేషన్ దుకాణాల పనితీరును పరిశీలిస్తాం. వినియోగదారులు ఇతరులకు విక్రయించినా అది తప్ఫే ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
దోమలో పట్టుబడిన..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.