Telangana News: నేడు హైదరాబాద్‌కు సిన్హా.. నగరంలో తెరాస భారీ ర్యాలీ

రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ రానున్నడంతో నగరంలో తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు...

Updated : 02 Jul 2022 11:19 IST

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్ రానున్నడంతో నగరంలో తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గులాబీ జెండాలతో నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు నంద కిషోర్ బిలాల్ వ్యాస్ ఆధ్వర్యంలో బేగంబజార్ నుంచి బేగంపేటకు ద్విచక్ర వాహనాలపై భారీగా తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్‌ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని