logo

కల్లు తాగి మహిళ మృతి

కల్లుతాగి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురైన  ఘటన శనివారం షాబాద్‌ మండలం కేసారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తొంట జంగయ్య భార్య శోభ(50) స్వగ్రామంలోని కల్లు దుకాణంలో

Published : 03 Jul 2022 03:54 IST

మరో ఇద్దరికి అస్వస్థత

షాబాద్‌, న్యూస్‌టుడే: కల్లుతాగి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురైన  ఘటన శనివారం షాబాద్‌ మండలం కేసారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తొంట జంగయ్య భార్య శోభ(50) స్వగ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు తాగింది. అనంతరం అక్కడికక్కడే కిందపడి అపస్మారక స్థితిలోకి చేరింది. ఆమెను పరీక్షించిన స్థానికులు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన కిష్టమ్మ, పద్మలు కూడా కల్లు తాగి అనారోగ్యానికి గురయ్యారు. ఒకరిని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకరిని ఉస్మానియాలో చేర్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఎందుకు చనిపోయిందీ వెల్లడవుతుందన్నారు. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ను వివరణకోరగా.. దుకాణంలోని కల్లు సేంపిల్‌ను సేకరించామని.. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు