logo

‘దేశవ్యాప్తంగా గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వాలపై ఒత్తిడి’

దేశవ్యాప్తంగా గురుకులాలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తానని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో గురుకుల పాఠశాలల విద్యార్థుల సమావేశంలో

Published : 04 Jul 2022 03:57 IST


మాట్లాడుతున్న కృష్ణయ్య. చిత్రంలో బాలయ్య, చంటి, వేముల రామకృష్ణ, గుజ్జకృష్ణ తదితరులు

నల్లకుంట, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా గురుకులాలు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తానని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం విద్యానగర్‌ బీసీ భవన్‌లో గురుకుల పాఠశాలల విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాటాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో 1200 గురుకులాలు ఏర్పాటయ్యాయని, మరిన్ని మంజూరు చేయాలన్నారు. గురుకులాల్లో పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు పీఎస్‌వీజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మురళీగౌడ్‌, ఉమ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని