పరేడ్ మైదానం.. కాషాయమయం
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభ సందర్భంగా ఆదివారం ఆ పరిసరాలు కాషాయమయంగా మారాయి. వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు భాజపా జెండాలు, భారీ పతాకాలు, పార్టీ కండువాలు ధరించి బహిరంగ సభాస్థలి చుట్టూ జై శ్రీరామ్..
మధ్యాహ్నం నుంచే తరలిన నాయకులు కార్యకర్తలు
సభలో శ్రేణుల ఉత్సాహం
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభ సందర్భంగా ఆదివారం ఆ పరిసరాలు కాషాయమయంగా మారాయి. వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు భాజపా జెండాలు, భారీ పతాకాలు, పార్టీ కండువాలు ధరించి బహిరంగ సభాస్థలి చుట్టూ జై శ్రీరామ్.. జైమోదీ... భారత్ మాతాకీజై అంటూ నినదించారు. దూరప్రాంతాల నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కార్యకర్తలు మధ్యాహ్నం ఒంటి గంటకే చేరుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మధ్యాహ్నం 2.30 గంటల తర్వాతే పోలీసులు వారిని అనుమతించారు. ఇక హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జాతీయ, రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రులు నేరుగా బహిరంగ సభకు చేరుకున్నారు. ప్రధాని రోడ్డు మార్గంలో రాజ్భవన్కు వెళ్లే సమయంలో ట్రాఫిక్ను నిలిపివేయడంతో.. తర్వాతే నాయకులు, కార్యకర్తలు తిరుగుముఖం పట్టారు.
సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. బేగంపేట, సీటీసీ పైవంతెనను మూసేశారు. ప్రగతిభవన్ ఎదురు నుంచి పైవంతెన పైకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, పరేడ్ మైదానం పరిసరాల్లో వాహనాలపై రాకపోకలను నిలిపేశారు.
మైదానం వెలుపల కమలోత్సాహం
సాయంత్రం ఐదు గంటల్లోపే పరేడ్ మైదానం కార్యకర్తలతో నిండిపోయింది. నగరం నలుమూలల నుంచి భారీగా తరలిన కార్యకర్తలు సీటీసీ పైవంతెన, పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్లో బయటే వేచి ఉన్నారు. ముఖ్య నేతల ప్రసంగాలప్పుడు జైమోదీ.. జై శ్రీరాం.. భారత్మాతాకీ జైఅంటూ నినాదాలతో హోరెత్తించారు.
మోదీకి కావాలనే తెరాస ఉచిత ప్రచారం: కేఏ పాల్
అమీర్పేట, న్యూస్టుడే: మోదీ నగర పర్యటనలో కావాలనే తెరాస ఉచిత ప్రచారం కల్పిస్తోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ విమర్శించారు. మోదీని చూసి తెరాస నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అమీర్పేట అపరాజితకాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో కేఏ పాల్ మాట్లాడారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం బాధ్యతగా వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలన్నారు. మోదీని కలవకుండా సాకులు చెపుతున్నారన్నారు. మోదీ వచ్చారు.. వెళ్తారని ఇందుకు రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే ప్రతీ ప్రాజెక్ట్లో లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. భాజపా, తెరాస ఇచ్చిన హామీలను నెరవేర్చాయని అనుకుంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
విధుల్లో ఉండగా వైద్యుడి అరెస్టు
రెడ్హిల్స్, న్యూస్టుడే: ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో విధులో ఉన్న డాక్టర్ రాజ్కుమార్ జాదవ్ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈయన గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కూడా. విధులు ముగించుకొని వస్తానన్నా వినకుండా పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు. నగరానికొస్తున్న ప్రధాని నరేంద్రమోదీని కలుస్తాం. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై కలిసి చర్చిస్తాం.. అవసరమైతే నిరసన చేపడతామని లంబాడీ హక్కుల ఐక్యవేదిక ద్వారా డాక్టర్ రాజ్కుమార్ జాదవ్ ప్రకటించారు. అందుకే ముందస్తు అరెస్టు చేసినట్లు నాంపల్లి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. మా గొంతు నొక్కినంత మాత్రాన ఉద్యమం ఆగదన్నారు.
అక్కరకు రాని పాస్లు.. ఆగిపోయిన నేతలు
ఈనాడు,హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భాజపా బహిరంగ సభకు హాజరయ్యేందుకు నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన పాసులు అక్కరకు రాకుండా పోయాయి. పాసులపై ఉన్న నంబరు గేట్నుంచే లోపలికి అనుమతించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఉండటంతో..ఇతర గేట్ల ద్వారా వచ్చిన నాయకులు, కార్యకర్తలకు నిరాశే కలిగింది. చివరకు సాధారణ కార్యకర్తలు వెళ్లిన ప్రవేశద్వారం నుంచే లోపలికి వెళ్లారు.
జిల్లాల నుంచి..
భాజపా నాయకులు రాష్ట్ర నలుమూలల నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను తరలించారు. యువకులు, దివ్యాంగులు, వృద్ధులను వాహనాల్లో తరలించారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జల్లాల నుంచి ఎక్కువమంది కార్యకర్తలు, నాయకులు పరేడ్ మైదానానికి తరలొచ్చారు. సాయంత్రానికే సభాస్థలి నిండిపోయింది.
భాజపా సభకు గద్దర్
ఈనాడు, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం భాజపా విజయ సంకల్ప సభకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు వచ్చానని, ఇతరత్రా మరే కారణాలు లేవని మీడియాకు వివరించారు. గతంలో తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభకు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
నేతలంతా సమావేశాల్లోనే బిజీ
ఈనాడు, హైదరాబాద్: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కీలక నేతలు రెండో రోజు ఆదివారం పూర్తి బిజీగా గడిపారు. ఉదయం నుంచే సమావేశాలు ప్రారంభం కావడంతో అక్కడికే పరిమితమయ్యారు. తొలిరోజు బయట కొంత సందడి కనిపించినా.. రెండో రోజు ఆ పరిస్థితి లేదు. పాసులున్న నాయకులనే అనుమతించడంతో పాసులు లేని రాష్ట్ర, జిల్లా నాయకులు సైతం బయటే ఉండిపోయారు.
బీజేవైఎం కార్యకర్తల వాలంటీర్ సేవలు
ఈనాడు, హైదరాబాద్: పెద్దసంఖ్యలో కార్యకర్తల రాక.. అందర్నీ అదుపు చేయాలంటే పోలీసులతోనే వీలుకాని పరిస్థితి.. ఇలాంటి సమయంలో బీజేవైఎం కార్యకర్తలు ప్రత్యేక సేవలు అందించారు. ఎవరికి కేటాయించిన గ్యాలరీల్లో వారు చేరుకునేలా తోడ్పాటు అందించారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపు చేస్తూ, ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 650 మంది బీజేవైఎం కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేస్తూ గ్యాలరీల వద్ద నిల్చుని సభ సజావుగా జరిగేందుకు సహకారం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’