logo

సభ ముగిశాక జోరు వాన

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా విజయ సంకల్ప సభ జరుగుతున్న సమయంలో వాన చినుకులు పలుకరించినా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సభ ముగిశాక సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, తార్నాక, బేగంపేట్‌ తదితర ప్రాంతాల్లో గాలివాన దుమారం రేపింది.

Published : 04 Jul 2022 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా విజయ సంకల్ప సభ జరుగుతున్న సమయంలో వాన చినుకులు పలుకరించినా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సభ ముగిశాక సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, తార్నాక, బేగంపేట్‌ తదితర ప్రాంతాల్లో గాలివాన దుమారం రేపింది. అప్పటికే సభకు హాజరైన కార్యకర్తలు తమ వాహనాల్లోకి ఎక్కడంతో భాజపా నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉంటే నగరంలో రాత్రి 10 గంటల తరువాత పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో అత్యధికంగా శివరాంపల్లిలో 18.0 మి.మీ. వర్షం పడింది. రాజేంద్రనగర్‌లో 12.3, ఆసిఫ్‌నగర్‌లో 11.8, నాంపల్లిలో 10.3, షేక్‌పేటలో 8.0, మల్కాజిగిరి 4.5 మి.మీ. వర్షం కురిసింది. బండ్లగూడ, బీహెచ్‌ఈఎల్‌, అత్తాపూర్‌, చార్మినార్‌, మౌలాలిలో జల్లులు పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని