vijya sankalp sabha : భాగ్యనగరాన.. అభివృద్ధే నమో స్వరాన
ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం జపించారు. కొత్త రాష్ట్రం పురోగతిలో అడుగడుగునా తోడున్నామంటూ చెప్పారు. నగరంలో పరేడ్ మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన చేసిన ప్రసంగం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, చిత్రంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మోహన్రావు, మురళీధర్రావు, లక్ష్మణ్, బొమ్మై, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా, బండి సంజయ్
ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం జపించారు. కొత్త రాష్ట్రం పురోగతిలో అడుగడుగునా తోడున్నామంటూ చెప్పారు. నగరంలో పరేడ్ మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన చేసిన ప్రసంగం భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేంద్ర మంత్రులు, కీలక నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. అంతకుముందు హెచ్ఐసీసీలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు మధ్యాహ్నం ముగిశాయి. అక్కడి నుంచి కీలకనేతలంతా సికింద్రాబాద్లోని సభాస్థలికి చేరుకున్నారు.
హెచ్ఐసీసీ నుంచి సభ జరిగే పరేడ్ మైదానానికి బయలుదేరుతున్న ప్రదాని నరేంద్ర మోదీ
సంకల్పించి.. సత్తా చూపించి
సభ విజయవంతంతో భాజపాలో నూతనోత్సాహం
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్: నగర భాజపా నేతలు రాత్రి పగలూ తేడా లేకుండా పడ్డ కష్టం ఫలించింది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ విజయంలో రాజధాని పరిధిలో మూడు జిల్లాల నేతలు కీలక భూమిక పోషించారు. ప్రధాన మోదీ పాల్గొంటున్న బహిరంగ సభను నభూతో అన్నట్లుగా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కంటే నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే వేలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి నగర నేతలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా జనసేకరణలో విజయవంతం కావడంతో సభ జరిగిన పరేడ్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. బయట కూడా భారీగా జనాలు ఉండిపోయారు. ఈ పరిణామం మూడు జిల్లాల పార్టీ విభాగాల్లో కొత్త ఉత్సాహం నింపింది.
పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీని చూడడానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను అదుపు చేస్తున్న పోలీసులు
దాదాపు రెండు నెలల కిందట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ జరిగింది. అప్పట్లో ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం శాఖమంత్రి అమిత్షా హాజరయ్యారు. అది విజయవంతం చేశారని అమిత్షా నగర నేతలను అభినందించారు. ఆ అనుభవంతో పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నెల రోజుల కిందట తలపెట్టారు. నగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి నాలుగువేల మందికి తక్కువ కాకుండా సభకు తీసుకువచ్చే బాధ్యతను నియోజవర్గాల నేతలకు అప్పగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులు ఇతర నేతలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్లకార్డు ప్రదర్శిస్తున్న కార్యకర్త
కార్పొరేటర్ల కీలక పాత్ర!
నగరానికి చెందిన భాజపా కార్పొరేటర్లు జన సమీకరణలో కీలక భూమిక పోషించారు. ముందుగానే వీరికి లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక కాలనీల నుంచి వాహనాలను ఏర్పాటు చేసి వీరు జనాన్ని తరలించారు. వీరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తి తోడ్పాటు అందించారు. తమకు ఈ సౌకర్యం కావాలని కోరిన వెంటనే మంత్రి కిషన్ ఏర్పాటు చేశారని ఓ కార్పొరేటర్ ‘ఈనాడు’కు తెలిపారు.
జన స్పందనే రాష్ట్రంలో పార్టీ విజయానికి సూచిక
కిషన్రెడ్డి, కేంద్రమంత్రి
సభకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. మైదానం సరిపోకపోవడంతో మూడింతలు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చిన వారిలో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలో భాజపా గెలుపు నల్లేరు మీద నడకేనని అర్థం అవుతోంది. ప్రధాని మోదీ ప్రసంగానికి జనం నుంచి లభించిన స్పందన అమోఘంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర పార్టీ ముందుకు వెళ్తుంది.
డప్పుదరువులతో సభా ప్రాంగణానికి వస్తున్న కళాకారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
[ 19-04-2024]
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు