logo

పెళ్లి వేడుకలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి మృతి

తాను ప్రేమించిన యువతికి వేరే యువకుడితో పెళ్లి జరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు. లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌

Published : 05 Jul 2022 01:21 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: తాను ప్రేమించిన యువతికి వేరే యువకుడితో పెళ్లి జరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు. లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం..పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబరు 240(రాజేంద్రనగర్‌) ప్రాంతానికి చెందిన షేక్‌ అశ్వాక్‌(20) స్థానికంగా ఉండే ఓ యువతి(19) కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను నిరాకరించిన యువతి కుటుంబ సభ్యులు గత నెల 30న ఆమెకు మరో యువకుడితో వివాహం జరిపించారు. అదే రోజు రాత్రి లంగర్‌హౌస్‌ రింగురోడ్డులోని మొఘల్‌ ఫంక్షన్‌హాల్‌లో విందు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అశ్వాక్‌ విందు జరుగుతున్న ఫంక్షన్‌హాల్‌కు చేరుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విందుకు హాజరైన వారు మంటలను ఆర్పివేసి చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన అశ్వాక్‌ ఆదివారం చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని