ఆమె.. చుట్టూ సైబర్ వల!
ఇంటా.. బయటా మాత్రమే కాదు. అర చేతిలోకి చేరిన స్మార్ట్ఫోన్. ప్రపంచాన్ని దగ్గర చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమె పాలిట ముప్పుగా మారింది. చదువు పూర్తయి కొలువు కోసం అన్వేషించే యువతులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకుంటూ
పార్ట్టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో టోకరా
మహిళలే లక్ష్యంగా చెలరేగుతున్న మాయగాళ్లు
ఇంటా.. బయటా మాత్రమే కాదు. అర చేతిలోకి చేరిన స్మార్ట్ఫోన్. ప్రపంచాన్ని దగ్గర చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమె పాలిట ముప్పుగా మారింది. చదువు పూర్తయి కొలువు కోసం అన్వేషించే యువతులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకుంటూ భర్తకు చేదోడుగా ఉండాలనుకునే గృహిణులు, కళాశాలకు వెళ్తూనే పార్ట్ టైమ్ ఉద్యోగావకాశాలు వెతికే విద్యార్థినులు, ఏదో రూపంలో ఇంటికి అండగా నిలవాలని భావించే మహిళలను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు చెలరేగుతున్నారు. కమీషన్కు ఆశపడే ఏజెంట్ల ద్వారా జాబ్ పోర్టల్లో రెజ్యూమె ఉంచిన ఉద్యోగార్థులు, బ్యాంకు ఖాతాలున్న మహిళలు, యువతుల వివరాలు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి మోసపోయినట్టు గ్రహించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలు చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకోవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ జి.శ్రీధర్ సూచిస్తున్నారు.
మోసమని తెలియక..
* నిజాంపేటకు చెందిన గృహిణి. బీటెక్ చదివినా కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇటీవల ఆమె వాట్సప్ నంబరుకు టెలిగ్రామ్ నంబరు నుంచి ఫోన్కాల్ వచ్చింది. ప్రతిరోజూ 10-30 నిమిషాలు ఆన్లైన్ షాపింగ్ వేదికగా వినియోగదారుల నుంచి ఆర్డర్స్ తీసుకుంటే కమీషన్ ఇస్తామనేది సారాంశం. నిర్వాహకులు పంపిన వెబ్సైట్లో బ్యాంకు ఖాతాలు సహా అన్ని వివరాలు ఆమె నమోదుచేశారు. వారిచ్చిన లక్ష్యాలు పూర్తిచేస్తున్న కొద్దీ ఆమె బ్యాంకు ఖాతాల్లో నగదు జమవడం వర్చువల్గా కనిపించేవి. రూ.7,08,439 నగదు విత్డ్రా చేసుకునేందుకు రూ.6.50లక్షలు జమ చేయాలన్నారు. తరువాత కొద్ది రోజులకే ఖాతాలో రూ.5,22,064 మాయమయ్యాయి.
* జగద్గిరిగుట్టలో బీటెక్ విద్యార్థినికి ఇంట్లో ఉండి ఉద్యోగం చేయవచ్చని వాట్సప్ నంబరుకు వెబ్సైట్ లింకు పంపారు. తమ ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజూ రూ.500-1000 సంపాదించవచ్చన్నారు. వారిచ్చిన ఐడీ, పాస్వర్డ్ సాయంతో లావాదేవీలు నిర్వహిస్తే కమీషన్ జమ చేస్తున్నట్టు నమ్మిస్తూ రూ.2.54లక్షలు కాజేశారు.
* కుత్బుల్లాపూర్కు చెందిన ఓ గృహిణి నగలు తాకట్టు పెట్టి రూ.3లక్షలు ఇన్వెస్ట్మెంట్ యాప్లో ఉంచి మోసపోయింది. భర్తకు తెలిస్తే సంసారం పాడవుతుందనే భయంతో ఆత్మహత్యకు యత్నించింది.
* పెరిగిన ఖర్చులు, పిల్లల చదువుల నేపథ్యంలో భర్తకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో, పార్ట్టైమ్ జాబ్ అని నమ్మి మోసపోయానని కేపీహెచ్బీకి చెందిన ఓ గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు.
* కొవిడ్ వేళ ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆన్లైన్ బారినపడి మోసపోయినట్టు సరూర్నగర్కు చెందిన ఓ బాధితురాలు వాపోయారు. ఎంటెక్ చేసిన తాను జాబ్ పోర్టల్లో పార్ట్టైమ్ జాబ్ కోసం రెజ్యూమె ఉంచానని, ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగమంటూ జూమ్ ద్వారా ఇంటర్వ్యూలు చేసి రూ.45,000 ప్రాసెసింగ్, మెడికల్ ఫీజులంటూ మోసగించారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్