logo

ప్రధానికి ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో

Published : 05 Jul 2022 01:53 IST

రాజ్‌భవన్‌లో మొక్క నాటుతున్న ప్రధాని నరేంద్ర

మోదీ. చిత్రంలో గవర్నర్‌ తమిళిసై తదితరులు

బేగంపేట, న్యూస్‌టుడే; ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసిన మోదీ సోమవారం ఉదయం 9.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. 9.25గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్యమైన భాజపా నేతలు వీడ్కోలు పలికారు.

ప్రధాని ఎదుట బతుకమ్మ, బోనాల ప్రదర్శన

రాజ్‌భవన్‌లో బస చేసిన మోదీ సోమవారం ఆ ఆవరణలో కదంబ మొక్కను నాటారు. గవర్నర్‌ తమిళిసై ఆధ్వర్యంలో బతుకమ్మ, బోనాలను ప్రదర్శించారు. పండగల ప్రత్యేకతల గురించి గవర్నర్‌ మోదీకి వివరించారు. గవర్నర్‌, రాజ్‌ భవన్‌ సిబ్బంది ఇచ్చిన ఆతిథ్యానికి మోదీ అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని