తనిఖీలు శూన్యం... తరుణి సొమ్ము మాయం..!
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు అందిస్తున్న స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు వాయిదాలు చెల్లించినా బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడేస్తున్నారు. సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న
సంవత్సరాలుగా స్త్రీ నిధి కిస్తుల స్వాహా
ఇటీవలి సామాజిక తనిఖీల్లో వెల్లడి
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
వివరాలు ఆరా తీస్తున్న సిబ్బంది
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు అందిస్తున్న స్త్రీనిధి రుణాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సభ్యులు వాయిదాలు చెల్లించినా బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడేస్తున్నారు. సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం తాజా సామాజిక తనిఖీలతో వెల్లడైంది. బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయడంతోపాటు చర్యలు చేపట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
పారదర్శకంగా ఉన్నా ....
జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామీణ మహిళలకు మహిళా సమాఖ్యల ద్వారా, పట్టణ ప్రాంత మహిళలకు మెప్మా ద్వారా స్త్రీనిధి రుణాలు అందజేస్తున్నారు. ఎలాంటి తనఖా లేకుండా రూ.25 వేల నుంచి రూ.3లక్షల దాకా వ్యక్తిగత రుణాల్ని అందజేస్తున్నారు. వాటిని తిరిగి 60 నెలల సులభ వాయిదాల్లో చెల్లించేలా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ఇంత పారదర్శకంగా ఉన్నా రుణ వాయిదాల వసూళ్లల్లో కొందరు అక్రమాలకు తెర లేపారు.
అధికారుల నిర్లక్ష్యం
ఏళ్ల తరబడి అవకతవకలు సాగుతున్నా అధికారులు గుర్తించలేకపోయారు. ఐనెల్లిలో ఒక్కో మహిళ నుంచి దాదాపు రూ.వెయ్యి చొప్పున నెలనెలా అదనంగా వసూలు చేసినా గమనించలేదు. నాలుగు సంవత్సరాలుగా అదనపు వసూళ్లకు పాల్పడుతుంటే గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని తీవ్ర విమర్శలొస్తున్నాయి. కనీసం ఇకముందైనా తనిఖీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
అనుమానం వచ్చిందిలా..
రుణాల్ని సద్వినియోగం చేసిన మహిళల పేరిట కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు బకాయి ఉంటున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖలోని స్త్రీనిధి మండల సమన్వయకర్తలు క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే తాము నెలనెలా వాయిదాల సొమ్మును సీసీ, అధ్యక్షురాలికి చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అనుమానం వచ్చిన సిబ్బంది మరింత మంది బకాయిదారులను సంప్రదించినా ఇదే సమాధానం రావడంతో ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీలు, బహిరంగ విచారణ జరిపించాలంటూ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర కార్యాలయం అధికారులకు నివేదించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో మూడు రోజులుగా బహిరంగ విచారణ చేపట్టింది.
ఏడు గ్రామాలు, పట్టణంలో..
తొలుత తాండూరు మండలం ఐనెల్లిలో సుదీర్ఘంగా మూడు రోజుల పాటు విచారణ జరిపిన బృందం ఏకంగా రూ.21.50 లక్షలు దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చారు. ఇక్కడి సభ్యులు నెలకు రూ.1,530లను వాయిదాగా చెల్లించాల్సి ఉంటే సీసీ, అధ్యక్షురాలు రూ.2,500ల చొప్పున వసూలు చేసినట్లు గుర్తించారు. 2018-19 నుంచి ఇలా అధిక వసూళ్లకు పాల్పడినట్లు నిగ్గు తేల్చారు. అల్లాపూర్లో వీఓఏ యూసుఫ్ రూ.5.70లక్షలు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. కరణ్కోటలోని మూడో గ్రామ సంఘంలో రూ.1.79లక్షలు, జిన్గుర్తిలో వీఓఏ శివరాం రూ.1.40లక్షలు, కోటబాస్పల్లిలో రూ.60వేలు, గుండ్లమడుగు తండాలో రూ.58వేలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. పట్టణంలోని పసారి వార్డులో మెప్మా ద్వారా రుణాలు అందించగా అక్కడి సభ్యులు రూ.1.70లక్షలు చెల్లించాల్సి ఉందని, రూ.1.75లక్షలు అధ్యక్షురాలి నుంచి రాబట్టాల్సి ఉన్నట్లు తేల్చారు. పెద్దేముల్ మండలం మారెపల్లిలోనూ సామాజిక తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానుంది.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం : తుమ్మల వేణు, రీజినల్ మేనేజరు, స్త్రీనిధి
మూడు రోజులుగా నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల ద్వారా సీసీలు, వీఓఏలు, అధ్యక్షురాలు వాయిదాల సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు గుర్తించాం. తనిఖీలు పూర్తయిన తరువాత నివేదికను డీఆర్డీఓ ద్వారా ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేయడంతోపాటు సస్పెండ్ చేసి సెర్ఫ్కు సరెండర్ చేసే చర్యలు ఉంటాయి.
జిల్లాలో గ్రామ సమాఖ్యలు 657
స్వయం సహాయక సంఘాలు 15,766
నమోదైన సభ్యులు: 1,69,706
నిర్దేశించిన స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.78.30 కోట్లు
సామాజిక తనిఖీలు చేసింది 9 గ్రామాల్లో
దుర్వినియోగమైన సొమ్ము రూ.34.92లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.