శిక్షణతో సరి.. యంత్రాలు లేవు మరి..!
జిల్లాలోని కుమ్మరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి తీసుకున్న చర్యలు ఆదిలోనే నీరు గారిపోయాయి. నేటి కంప్యూటర్ యుగంలో గ్రామాల్లో నివసించే కుమ్మరులు
వికారాబాద్ మున్సిపాలిటీ, న్యూస్టుడే: జిల్లాలోని కుమ్మరులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఆర్థికంగా ఎదగడానికి తీసుకున్న చర్యలు ఆదిలోనే నీరు గారిపోయాయి. నేటి కంప్యూటర్ యుగంలో గ్రామాల్లో నివసించే కుమ్మరులు తమ చక్రంపైనే మట్టితో కుండలు, ఇతర పాత్రలు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల ద్వారా సులభంగా పాత్రలను తయారు చేయవచ్చని బీసీ అధికారులు తెలిపి వారిని శిక్షణ వైపు మళ్లించారు. తరువాత వీరి గురించే మరిచిపోయారు.
రూ.20 వేలు కట్టించుకున్నారు
మూడు సంవత్సరాల క్రితం జిల్లాలోని చురుకైన అర్హత కల్గిన 200 మంది యువకులను గుర్తించి యంత్రాల ద్వారా మట్టితో వస్తువులు, ఇతర పాత్రలు చేసే వాటిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్లో నెల, రెండు నెలల పాటు ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో కొంత మందికి మట్టితో విగ్రహాలను, పాత్రలు తయారు చేసే యంత్రాలను ఇప్పిస్తామని ఒక్కక్కరి వద్ద రూ. 20 వేలు కట్టించుకున్నారు. ఇప్పటికీ వారికి యంత్రాలు పంపిణీ చేయలేదు. యంత్రాలు వస్తాయని కుమ్మరులు మాత్రం ఆశగా చూస్తున్నారు.
జిల్లా అధికారికి విన్నవించినా..: డబ్బులు చెల్లించిన వారికి యంత్రాలు ఇప్పించాలని కోరుతూ ఇటీవల కలెక్టర్ కార్యాలయానికి కుమ్మరులు వచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతులు అధికారి ఉపేందర్ను కలిసి తమ గోడును వినిపించారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు యంత్రాలు పంపిణీ చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టితో విగ్రహాలను, పాత్రలు, వస్తువులు తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నామని యంత్రాలు లేక వీటిని చేయలేకపోతున్నామని అధికారికి వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరినా ఇంతవరకు స్పందన కనిపించలేదు.
వెంటనే మంజూరు చేయండి: మల్లేశం, కోట్పల్లి
మాది కోట్పల్లి మండల కేంద్రం. 10 సంవత్సరాల నుంచి మట్టితో కుండలను, పాత్రలను చేస్తున్నాం. బీసీ అధికారులు ఇప్పించిన శిక్షణను తీసుకున్నాను. తర్వాత యంత్రాలను ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటికి ఇప్పించలేదు. వెంటనే మంజూరు చేయించి ఆదుకోవాలి. తద్వారా ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది.
జాప్యం చేస్తున్నారు తప్ప ఇవ్వడంలేదు : శ్రీశైలం, బొంరాస్పేట
యంత్రాలు పంపిణీ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉండేది. మూడు సంవత్సరాల నుంచి యంత్రాల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులను తరచుగా కలుస్తున్నాం. వారు మాత్రం ఇప్పిస్తాం అంటూ జాప్యం చేస్తున్నారు.. తప్ప స్పందించడంలేదు. దీనివల్ల ఆర్థికంగానూ అవస్థలు పడాల్సి వస్తోంది. వెంటనే యంత్రాలను పంపిణీ చేయాలి. ఆర్థికంగా ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా