Hyderabad News: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

నగరంలోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి

Updated : 05 Jul 2022 12:49 IST

హైదరాబాద్‌: నగరంలోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు