T Congress: విష్ణువర్ధన్రెడ్డి ఇంట్లో లంచ్.. వస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్ సీనియర్లు!
దివంగత పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్) తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఆ పార్టీ సీనియర్లు హాజరుకాలేదు
హైదరాబాద్: దివంగత పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్) తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఆ పార్టీ సీనియర్లు హాజరుకాలేదు. హైదరాబాద్ దోమలగూడలోని ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మినహా ముఖ్యనేతలెవరూ కనిపించలేదు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య మళ్లీ విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో ఈ లంచ్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఉదయం విష్ణువర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ సీనియర్లతో అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటానని చెప్పారు. చాలా గ్యాప్ వచ్చినందున వారిని లంచ్కు ఆహ్వానించానని.. వీహెచ్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, శ్రీధర్బాబు వస్తామని చెప్పినట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దిల్లీ పర్యటనలో ఉండటంతో ఆయన్ను ఆహ్వానించలేదన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆహ్వానిస్తే సాయంత్రానికి వస్తానని చెప్పారని విష్ణు తెలిపారు. కానీ వస్తామన్న నేతలు ముఖం చాటేసినట్లు సమాచారం. లంచ్ సమయానికి ఆయా నేతలెవరూ విష్ణువర్ధన్రెడ్డి ఇంటికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకమాండ్ ఆదేశాలతోనే సీనియర్లు ఈ విందు సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా