logo

ఫ్యాబ్‌ సిటీ భూనిర్వాసితులకు న్యాయం

ఫ్యాబ్‌ సిటీ భూనిర్వాసితులకు ఎట్టకేలకు న్యాయం లభించిందని తెలంగాణ బీసీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం అందజేసిందన్నారు.

Published : 06 Jul 2022 02:17 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: ఫ్యాబ్‌ సిటీ భూనిర్వాసితులకు ఎట్టకేలకు న్యాయం లభించిందని తెలంగాణ బీసీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం అందజేసిందన్నారు. తమ పోరాటానికి మద్దతుగా నిలిచినందుకు మంగళవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాధవరెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు రాములు, నగేశ్‌, నర్సింహా, నారాయణ, సత్తయ్య, అంజయ్య, సైదులు, యాదయ్య తదితరులు ఆమెను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. రైతుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి మంత్రి కేటీఆర్‌ తదితరుల చేతుల మీదుగా నష్టపరిహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని