hyderabad : మన బ్యాంకే కదా.. వాడేసుకుందాం
బ్యాంక్లో మేనేజర్ ఉద్యోగమంటే బ్యాంకంతా మనదే.. మనమే రుణాలు తీసుకుందాం.. షేర్లు కొందాం.. అమ్మేద్దాం.. లాభాలొస్తే జమచేద్దాం.. నష్టాలొస్తే కిస్తీలు కట్టకుండా వదిలేద్దామని హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ భావించాడు.
రూ.1.62 కోట్లు కుటుంబీకులకు.. అటు నుంచి షేర్ల క్రయవిక్రయాలకు
ఈనాడు, హైదరాబాద్: బ్యాంక్లో మేనేజర్ ఉద్యోగమంటే బ్యాంకంతా మనదే.. మనమే రుణాలు తీసుకుందాం.. షేర్లు కొందాం.. అమ్మేద్దాం.. లాభాలొస్తే జమచేద్దాం.. నష్టాలొస్తే కిస్తీలు కట్టకుండా వదిలేద్దామని హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ భావించాడు. అనుకున్నదే తడవుగా బంగారురుణాలపై దృష్టి సారించాడు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల వివరాలు సేకరించాడు. అందులో తొమ్మిది మంది పేర్లతో బంగారు రుణాలు తీసుకుని కుటుంబీకుల ఖాతాల్లోకి జమచేశాడు. అటునుంచి తన డీమ్యాట్ ఖాతాలోకి జమచేసుకుని షేర్ల క్రయవిక్రయాలు సాగిస్తున్నాడు. ఆర్థిక సంవత్సరం చివర్లో లెక్కలు తీయగా రూ.1.62 కోట్ల అక్రమాలు బయటపడ్డాయి. ఉన్నతాధికారులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు బ్యాంకు మేనేజర్ను అరెస్ట్ చేశారు. ఆయన డీమ్యాట్ ఖాతాలను పరిశీలించి, వాటిల్లోని రూ.1.58 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేశారు.
రూ.35 లక్షల విచక్షణాధికారంతో..
బ్యాంక్ ఆఫ్ బరోడా బోయిన్పల్లి శాఖలో సంతోష్ కుమార్ స్కేల్-2 మేనేజర్గా గతేడాది అక్టోబరు నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. బంగారంపై గరిష్టంగా రూ.35లక్షల రుణం ఇచ్చే అధికారం ఆయనకు ఉండడంతో, దాన్ని అవకాశంగా మలుచుకున్నాడు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ బ్యాంకులోని తొమ్మిది పొదుపు ఖాతాల నుంచి రూ.1.62 కోట్లు రుణం తీసుకున్నాడు. రుణం మంజూరుపై సంతకం సంతోష్ది ఉండడంతో బంగారం ఉందా? లేదా? అని ఉన్నతాధికారులు గమనించలేదు. తాను సంతకం చేసిన పత్రాలను ధ్రువీకరించేందుకు మరో అధికారికి చెందిన ఐడీలను వినియోగించుకున్నాడు. కిస్తీలు నాలుగైదు నెలల తర్వాత కడతారంటూ పొదుపు ఖాతాలు తీసుకున్న వారి తరఫున సంతోష్ చెప్పడంతో బ్యాంకు అధికారులకు అనుమానం రాలేదు..
మార్చిలో తనిఖీలతో వెలుగులోకి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!