సాగర్.. మరింత సుందరం
హుస్సేన్సాగర్ చుట్టూ పర్యాటక శోభను మరింత పెంచేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇక్కడి లుంబినీ, ఎన్టీఆర్ పార్కులను శని, ఆదివారాల్లో 2-2.5 లక్షల మంది సందర్శిస్తుంటారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళిక
లుంబినీ పార్కులో బోటింగ్ ప్రాంతం
ఈనాడు, హైదరాబాద్: హుస్సేన్సాగర్ చుట్టూ పర్యాటక శోభను మరింత పెంచేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇక్కడి లుంబినీ, ఎన్టీఆర్ పార్కులను శని, ఆదివారాల్లో 2-2.5 లక్షల మంది సందర్శిస్తుంటారు. ప్రస్తుతం లుంబీని పార్కు చెంతనే ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మిస్తోంది. ఎన్టీఆర్ పార్కు సమీపంలో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం రానుంది. కొత్త సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సాగర్ చుట్టూ రోప్వేకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీంతో ఈ ప్రాంతమంతా పర్యాటకం, ట్రాఫిక్పరంగా మరింత రద్దీగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రణాళికయుతమైన అభివృద్ధికి హెచ్ఎండీఏ సిద్ధమైంది.
ఏం చేస్తారంటే..
* దశాబ్దాల క్రితం ఈ రెండు పార్కులను తీర్చిదిద్దారు. అవే వసతులు ఉన్నాయి. కానీ పర్యాటకుల తాకిడి ఆరేడు రెట్లు పెరిగింది. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రీడిజైన్ చేయనున్నారు. మరింత ఎక్కువ మందికి ఇక్కడ వసతులు కల్పించనున్నారు.
* పార్కులు చుట్టూ పాదచారులు నడిచేందుకు సరైన వసతులు లేవు. ఇలాంటి సమస్యలకు మాస్టర్ప్లాన్లో పరిష్కారం లభించనుంది.
* రాత్రయితే హుస్సేన్సాగర్ చుట్టూ విదేశాల మాదిరిగా మిరుమిట్లు గొలిపేలా విద్యుత్తు లైట్లతో తీర్చిదిద్దనున్నారు. అంతేకాక సాగర్కు రోడ్డుకు మధ్యలో రక్షణ కంచెను మరింత పకడ్బందీగా ఏర్పాటు చేయనున్నారు. ఇలా కొత్త మాస్టర్ప్లాన్తో ఈ రెండు పార్కులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నామని హెచ్ఎండీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్