logo

రసాయనాలలో కలిపి బంగారం తరలింపు

దుబాయ్‌ నుంచి రసాయనాల మాటున తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన కథనం ప్రకారం..

Published : 06 Jul 2022 02:40 IST


అధికారులు స్వాధీనం చేసుకున్న టవల్‌, పసిడి

శంషాబాద్‌: దుబాయ్‌ నుంచి రసాయనాల మాటున తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. విమానాశ్రయ అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి బయల్దేరారు. ఈ క్రమంలో 478 గ్రాముల బంగారాన్ని నైట్రిక్‌ యాసిడ్‌ ద్రావణంలో కలిపారు. చిన్న చిన్న ముక్కలను టవల్‌కు అంటుకునేలా చేసి తీసుకొచ్చారు. వారి సామగ్రి క్షుణ్నంగా తనిఖీ చేయగా బంగారం తరలింపు గుట్టురట్టయింది. రూ.25 లక్షల విలువైన పసిడి స్వాధీనం చేసుకుని ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని