logo

వైభవంగా ఎల్లమ్మ తల్లి రథోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్‌ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంలో అమ్మవారు

Published : 07 Jul 2022 02:11 IST

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం రాత్రి అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్‌ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంలో అమ్మవారు ఆశీనులు కాగా వేలాది మంది భక్తులు రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. శివసత్తుల బోనాల సందడి, కోలాటం, యువకుల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలతో పలువురు సందడి చేయగా బల్కంపేట, సంజీవరెడ్డినగర్‌, బీకేగూడ, శ్రీరామ్‌నగర్‌ కాలనీల మీదుగా ఊరేగింపు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని