logo

ఆవుల సుబ్బారావు సహా మరో ముగ్గురికి పోలీసు కస్టడీ

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారి ఆవుల సుబ్బారావుతోపాటు మరో ముగ్గురిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

Published : 07 Jul 2022 02:06 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారి ఆవుల సుబ్బారావుతోపాటు మరో ముగ్గురిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. జూన్‌ 17న అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సృష్టించిన విధ్వంసానికి సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు మద్దతిచ్చారని ఆరోపణలతో రైల్వే పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండులో ఉన్న అతడితోపాటు అనుచరులు మల్లారెడ్డి, శివకుమార్‌, బీసీరెడ్డిలను కోర్టు అనుమతితో జైలు నుంచి రెండు రోజుల విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం కస్టడీకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని