logo

పటాన్‌చెరు వద్ద కోళ్ల పందేల స్థావరంపై దాడి

పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారు మామిడి తోటలో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70

Published : 07 Jul 2022 02:06 IST

పారిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారు మామిడి తోటలో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో 70 మంది ఉండగా.. ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అక్కినేని సతీష్‌, కృష్ణంరాజు, శ్రీను బృందంగా ఆడుతున్నారని తెలిపారు. 21 మందిని పట్టుకున్నారు. రూ.13లక్షలు, 26 వాహనాలు,  30 కోడి కత్తులు, 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. చింతమనేని ప్రభాకర్‌, కృష్ణంరాజు పరారయ్యారని, అక్కినేని సతీష్‌, బర్ల శ్రీను అదుపులో ఉన్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని