logo

వాగు దాటుతూ రైతు గల్లంతు

వాగు దాటుతూ ప్రమాదవశాత్తు రైతు గల్లంతైన సంఘటన దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జావిద్‌ (52) మధ్యాహ్నం....

Published : 06 Aug 2022 00:45 IST

జావిద్‌

పరిగి,దోమ, న్యూస్‌టుడే: వాగు దాటుతూ ప్రమాదవశాత్తు రైతు గల్లంతైన సంఘటన దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జావిద్‌ (52) మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలానికి వెళ్లాడు. దారిలో ఉన్న దోమ వాగును దాటేందుకు చరవాణి, దుస్తులు, చెప్పులను ఒడ్డున పెట్టాడు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం  ఇంటికి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో మళ్లీ వాగు దాటేందుకు యత్నించాడు. ఆ సమయంలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టుకోల్పోయి గల్లంతయ్యాడు. రైతు ఎంతకూ ఇంటికి చేరకపోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామస్థులు, పోలీసులు, కుటుంబీకులు సమష్టిగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వాగులో ఓవైపు లోతైన గుంత ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్రామయ్య తెలిపారు. ఎగువన కురిసిన వర్షానికి వరద తగ్గలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని