అంతర్గత విభేదాలు.. అభివృద్ధికి తిలోదకాలు!
తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు, 14వేల గృహాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనాభా 71వేలు. అనధికారికంగా లక్ష వరకు ఉంటుంది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. వీటితో పనులు చేపడితే వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. అయితే పాలక పక్షంలో నెలకొన్న అంతర్గత విభేదాలు కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి.
రూ.కోట్లు ఉన్నా ముందుకు సాగని పనులు
న్యూస్టుడే, తాండూరు
సాయిపూర్లో కాలువ నిర్మాణం లేక..
పురపాలికల్లో సకల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తద్వారా ప్రజల ఇబ్బందులు దూరం చేయాలన్నది ధ్యేయం. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ కారణాలతో అడుగు ముందుకు పడటంలేదు. రూ.కోట్లు అందుబాటులో ఉన్నా, పాట్లు తప్పడంలేదు. ఇదే పరిస్థితి తాండూరు పట్టణంలో నెలకొంది. ఈ వ్యవహారంపై ‘న్యూస్టుడే’ కథనం...
తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు, 14వేల గృహాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనాభా 71వేలు. అనధికారికంగా లక్ష వరకు ఉంటుంది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. వీటితో పనులు చేపడితే వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. అయితే పాలక పక్షంలో నెలకొన్న అంతర్గత విభేదాలు కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. ఏడాదిగా రూ.10.5 కోట్లు మూలుగుతున్నాయి. 14వ ఆర్థికసంఘం, 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి పద్దుల కింద మంజూరైనవి, పన్నుల రూపకంలో వచ్చినవి ఇందులో ఉన్నాయి. పట్టణంలో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణం, తాగు నీటి సరఫరాకు పైపుల విస్తరణ, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వినియోగించవచ్చు. అయితే పాలక పక్షం రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
దారులు అస్తవ్యస్తం
చాలా కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేవు. వానలకు మట్టి రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల నడవలేని దుస్థితి. కాలువలు లేని ప్రాంతాల్లో ఎగువ నుంచి వస్తున్న మురుగు ఖాళీ ప్రదేశాల్లో మడుగు కడుతోంది. దీంతో దుర్వాసన వ్యాపించి ఆయా చోట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు దోమలు, ఈగల వ్యాప్తి చెందుతున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవడంలేదు.శాంతినగర్, భవానీనగర్, సాయిపూరు, ఎన్టీఆర్ కాలనీ, పాత తాండూరు, గ్రీన్సిటీ, తులసీనగర్, ఆదర్శనగర్, విశ్వంబర కాలనీ, గొల్ల చెరువు, మార్కండేయ నగర్, అయ్యప్ప నగర్ కాలనీల్లో మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసేందుకు నిధులు సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడంలేదు.
కొరవడిన సమన్వయం
తాండూరు పురపాలికలోని అధికార పక్షం కౌన్సిలర్లు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవీ కోసం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకటి ఎమ్మెల్సీకి, మరోటి ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. అంతర్గత ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పదవి చేపట్టిన వారు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజీనామా చేసేది లేదు, ఈ వ్యవహారం అధిష్ఠానం చూసుకుంటుందని ఎమ్మెల్సీ వర్గం పేర్కొంటోంది. ఇరువర్గాల పరస్పరం కుర్చీల కోసం పాకులాడుతున్నాయి తప్పితే, అభివృద్ధి పనుల విషయాన్ని పక్కకు పెట్టారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆరు నెలల కిందటే కేటాయించినా
వార్డుల్లో అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతి వార్డుకు రూ.15 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆరు నెలల కిందటే నిధుల కేటాయించారు. ఇదే విషయమై రూపొందించిన ఎజెండాను పాలక పక్షంలోని కొందరు కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షంలోని మరి కొందరు ఆమోదించారు. అయితే రూపొందించిన ఎజెండా తన ప్రమేయం లేకుండానే జరిగి పోయిందని పేర్కొంటూ మున్సిపల్ ఛైర్పర్సన్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఎజెండాలో పొందు పరిచిన పనులకు తాత్కాలికంగా బ్రేకు పడింది. ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎజెండాకు అనుమతి లభిస్తే తప్ప నిర్ణీత పనులకు టెండర్లు జరిగే పరిస్థితి లేదు.
ఏం జరుగుతుందో తెలియడం లేదు : స్వప్న, పురపాలిక అధ్యక్షురాలు, తాండూరు
అధికారిక కార్యకలాపాల సమాచారం చెప్పడంలేదు. కార్యాలయంలో ఏ అధికారి ఏం చేస్తున్నారో నా వరకు రావడం లేదు. ఎజెండాపై న్యాయస్థానానికి వెళ్లిన వ్యవహారానికి సంబంధించిన దస్త్రం ఉన్నతాధికారుల వద్ద ఉంది. తుది నిర్ణయం వారే తీసుకోవాల్సి ఉంది.
పనులు పెండింగులో ఉన్నది వాస్తవమే : అశోక్ కుమార్, ఇన్ఛార్జి కమిషనర్
మున్సిపాలిటీలో చాలా పనులు పెండింగులో ఉన్న విషయం వాస్తవమే. రెండున్నరేళ్లలో 128 పనులకు టెండర్లు జరిగాయి. ఇందులో 40 పనులకు మాత్రమే గుత్తేదార్లు ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన వాటికి జరగలేదు. వ్యవహారం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్