logo

అగ్నిపథ్‌ నిరసన కేసులో మరో 13 మందికి బెయిల్‌

అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన కేసులో మరో 13 మంది బెయిల్‌పై విడుదలయ్యారు. జూన్‌ 17న నిర్వహించిన ఆందోళనల్లో ప్రధాన....

Published : 06 Aug 2022 01:52 IST

రెజిమెంటల్‌బజార్‌: అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన కేసులో మరో 13 మంది బెయిల్‌పై విడుదలయ్యారు. జూన్‌ 17న నిర్వహించిన ఆందోళనల్లో ప్రధాన సూత్రధారులతో కలిపి మొత్తం 69 మందిపై కేసులు నమోదు చేశారు. 65 మందిని అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జులైలోనే 29 మంది విడుదలయ్యారు. 16 మందికి ఆగస్టు 1న బెయిల్‌ మంజూరు కాగా వీరిలో 13 మంది గురువారం సాయంత్రం విడుదల అయ్యారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని