logo

పిస్టల్‌తో సంచరిస్తున్న వ్యక్తి పట్టివేత

దేశవాళీ పిస్టల్‌తో సంచరిస్తున్న పాతనేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, జవహర్‌నగర్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 06 Aug 2022 01:52 IST


స్వాధీనం చేసుకున్న పిస్టల్‌, రాకేష్‌త్యాగి

జవహర్‌నగర్‌: దేశవాళీ పిస్టల్‌తో సంచరిస్తున్న పాతనేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, జవహర్‌నగర్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి రాకేష్‌ త్యాగి(43), దమ్మాయిగూడ సిద్ధార్థనగర్‌కాలనీలో ఉంటున్నాడు. తన బావమరిది ఆశిశ్‌ త్యాగి సాయంతో నాలుగు నెలల క్రితం పిస్టల్‌ను రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. శుక్రవారం పీఎస్‌రావునగర్‌ ప్రాంతంలో పిస్టల్‌తో సంచరిస్తుండగా ఎస్‌ఓటీ, జవహర్‌నగర్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై రెండు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. సొంతూర్లో భూ వివాదాలున్నాయని ఆత్మరక్షణ కోసమే పిస్టల్‌ను కొనుగోలు చేశానని నిందితుడు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని