logo

బధిరుల రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు షురూ

ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసింగారం పరిధిలోని బాబురావు సాగర్‌ క్రికెట్‌ మైదానంలో తెలంగాణ బధిరుల మొదటి టీ-20 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి.

Published : 07 Aug 2022 02:05 IST

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసింగారం పరిధిలోని బాబురావు సాగర్‌ క్రికెట్‌ మైదానంలో తెలంగాణ బధిరుల మొదటి టీ-20 రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లాలకు చెందిన ఒక్కో జట్టు పాల్గొంది. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబరులో ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు శిక్షకుడు పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని