logo

ఆచార్యుని సేవలు చిరస్మరణీయం

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి ప్రశంసించారు. శనివారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఆచార్య

Published : 07 Aug 2022 02:22 IST

 
నివాళులు అర్పిస్తున్న పుర అధ్యక్షురాలు మంజుల తదితరులు

వికారాబాద్‌, వికారాబాద్‌ మున్సిపాలిటీ, టౌన్‌, పెద్దేముల్‌, తాండూరు టౌన్‌: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి ప్రశంసించారు. శనివారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఆచార్య జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ సీఐ నాగేశ్వరరావు, ఐటీసీటీ సీఐ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు అచ్చుతరావు, రత్నం, ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

* వికారాబాద్‌లో మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర తదితరులు నివాళులర్పించారు.

* పెద్దేముల్‌లో తహసీల్దారు మహేష్‌, ఆర్‌ఐ రాజురెడ్డి పాల్గొన్నారు.

* తాండూరు పట్టణంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షురాలు పట్లోళ్ల దీప, కౌన్సిలర్లు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, పట్టణ, గ్రామీణ సీఐలు రాజేందర్‌రెడ్డి నివాళులర్పించారు.

* జిల్లా వెనుకబడిన తరుగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఉపేందర్‌, కోటాజి, మల్లేశం, కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


తాండూరులో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు