logo

సీతారామం సినిమా ప్రదర్శన ఆలస్యం.. థియేటర్‌ వద్ద ప్రేక్షకుల ఆందోళన

సీతారామం (Sita Ramam) సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో బంజారాహిల్స్‌లోని పీవీఆర్‌

Published : 07 Aug 2022 17:10 IST

హైదరాబాద్‌: సీతారామం (Sita Ramam) సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో బంజారాహిల్స్‌లోని పీవీఆర్‌ ఆర్‌కే సినీఫ్లెక్స్‌ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు మొదలు కావాల్సిన ప్రదర్శన మధ్యాహ్నం 3గంటలకు కూడా ప్రారంభం కాకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  సాంకేతిక సమస్య వల్ల షో క్యాన్సిల్‌ అయిందని, టికెట్‌ డబ్బులు తిరిగి ఇస్తామని థియేటర్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆదివారం సెలవురోజు సమయాన్ని వృథా చేశారంటూ పలువురు వాగ్వాదానికి దిగడంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన కారులకు సర్దిచెప్పారు. 

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ  సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని