వర్షం.. తెచ్చింది పుడమికి బలం
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేసింది. మీటరు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు జలమట్టం పెరిగింది. 2021 జులై నెల నుంచి ఈ ఏడాది జులై చివరి వరకు
పెరిగిన భూ గర్భ జలం
ఉరకలెత్తిన శివసాగర్ జలాశయం
న్యూస్టుడే, తాండూరు: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేసింది. మీటరు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు జలమట్టం పెరిగింది. 2021 జులై నెల నుంచి ఈ ఏడాది జులై చివరి వరకు ఫిజియో మీటరు ఆధారంగా నమోదైన గణాంకాలను భూగర్భ జల వనరుల శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. దీని ఆధారంగానే జిల్లాలో ఏ గ్రామంలో ఎంత మేర జలమట్టం నమోదైందో రికార్డుల్లో పొందు పరిచారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
జలాశయాలు, చెరువులు నిండిపోవడంతో..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,175 చెరువులకు గాను 367 చెరువుల్లోకి సామర్థ్యానికి మించిన నీరు వచ్చింది. మరో 145 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం మేర చేరింది. 116 చెరువుల్లోకి 25 శాతం నుంచి 50 శాతం, 105 చెరువుల్లోకి 25 శాతం కంటే తక్కువ నీరు చేరింది. కోట్పల్లి, లక్నాపూరు, సర్పన్పల్లి, జుంటుపల్లి జలాశయాల్లోకి కూడా స్థాయికి మించిన నీరు వచ్చింది. ఒక్కో చెరువు శిఖం భూమి 300 ఎకరాల నుంచి 1,750 ఎకరాల్లో విస్తరించింది. 10 అడుగుల నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రస్తుతం నీరు నిల్వ ఉండడంతో భూమిలోకి వేగంగా ఇంకి పోతుంది.
కి.మీ నుంచి 10 కి.మీ. వరకు ప్రవాహం
చెరువులు, జలాశయాల్లో నిండిన నీరు పరిసరాల్లోని కిలోమీటరు విస్తీర్ణం నుంచి 10 కిలో మీటర్ల విస్తీర్ణం వరకు భూగర్భంలోకి ఇంకి పోతుంది. ఈ కారణంగానే లోతులో ఉన్న జలం క్రమేసి పైకి వచ్చింది.
* భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధానమైన మూసీ, కాగ్నా, కాకరవేణి నదులతో పాటు గ్రామాల సమీపంలోని వాగులు కూడా వరద]తో ఉద్ధృతంగా ప్రవహించాయి.ఈ నేపథ్యంలో పరివాహకంగా ఉన్న అన్ని బోర్లలో జల మట్టం గణనీయంగా పెరిగింది.
* అడవుల్లో నిర్మించిన కుంటలు, ఆనకట్టలు కూడా భారీ వర్షాల కారణంగా నీటితో నిండాయి. దీంతో పరిసరాల్లో పెరుగుతున్న చెట్లకు భూమి నుంచి తేమ శాతం కావాల్సిన మేర లభించడంతో ఏపుగా పెరిగేందుకు దోహదం చేసింది.
కొన్ని నిదర్శనాలు
* పెద్దేముల్ గ్రామంలోని ఒకరి ఇటిపై ఉన్న 500 లీటర్ల నీటి ట్యాంకు ఇంతకు ముందు బోరు స్టార్ట్ చేసిన 6 నిమిషాల్లో నిండేది. ప్రస్తుతం పెరిగిన జలమట్టంతో బోరు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి కారణంగా కేవలం నాలుగు నిమిషాల్లోనే నిండుతుంది.
* యాలాల మండలం సంగెం కుర్దు గ్రామ సమీపం కాగ్నానది పరివాహకంగా ఉన్న బోర్లలో 8 మీటర్ల లోతులో నీరు ఉండేది. ప్రస్తుతం 6 మీటర్లలోనే నీరు కనిపిస్తోంది.
* శివసాగర్ జలాశయం కింది భాగంలో ఉన్న విశ్వనాథ్ పూరు గ్రామంలోని బోర్లలో నీటి ఒత్తిడి పెరిగింది.
వరద ఎక్కువగా వృథా కాలేదు
- దీపారెడ్డి, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి
భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరద చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతలు, పర్కులేషన్ ట్యాంకుల్లోకి చేరింది. ఈ కారణంగా నీరు ఎక్కువగా వృథా కాలేదు. నీరు నిల్వ ఉన్న వనరుల కారణంగా పరిసరాల్లోని బోర్లు, బావుల్లో జలమట్టం పెరిగింది. భూమి పొరల్లోనూ నీరు ఎక్కువగా ఉంది. ఇది శుభ పరిణామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్